ట్విట్టర్లోకి అడుగుపెట్టిన వైఎస్ జగన్ | YS jagan mohan reddy enters twitter | Sakshi
Sakshi News home page

ట్విట్టర్లోకి అడుగుపెట్టిన వైఎస్ జగన్

Feb 25 2015 5:36 PM | Updated on Jul 25 2018 4:09 PM

ట్విట్టర్లోకి అడుగుపెట్టిన వైఎస్ జగన్ - Sakshi

ట్విట్టర్లోకి అడుగుపెట్టిన వైఎస్ జగన్

ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోషల్ మీడియాలోకి ప్రవేశించారు.

ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోషల్ మీడియాలోకి ప్రవేశించారు. @ysjagan అనే ట్విట్టర్ హ్యాండిల్తో ఆయన డిజిటల్ మీడియాలోకి అడుగుపెట్టారు. ఇన్నాళ్లుగా ప్రజలతో మమేకం అవుతూ.. నేరుగా వారితోనే సంబంధ బాంధవ్యాలు కొనసాగిస్తున్న విపక్షనేత.. ఇప్పుడు నేరుగా సంప్రదించడానికి వీలుగా ట్విట్టర్ ఖాతాను తెరిచారు.

యువతీ యువకులు, ఎన్నారైలు, ఇతరులు ఎవరైనా సరే వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి తమ అభిప్రాయాలు తెలియజేయడానికి, వివిధ అంశాలపై ఆయన తన మనోభావాలను పంచుకోడానికి వేదికగా ఈ ట్విట్టర్ ఖాతా ఉపయోగపడనుంది. బుధవారం సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో ఈ ట్విట్టర్ అకౌంట్ యాక్టివేట్ అయ్యింది. సోషల్ మీడియా విస్తృతి పెరిగిన నేపథ్యంలో ఆయా అంశాలు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న పలు నిర్ణయాలపై ఏపీలోని ఏకైక ప్రతిపక్ష పార్టీ అధినేతగా జగన్ ట్వీటర్ ద్వారా ఎప్పటికప్పుడు స్పందించేందుకు వీలవుతుందని పార్టీ నేతలు వెల్లడించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement