సెల్‌ టవర్‌ ఎక్కిన యువకుడు

Young Man Protest Over Climbs Cell Tower In Chittoor - Sakshi

సాక్షి, చిత్తూరు: జిల్లాలోని రామకుప్పం మండలంలో ఓ యువకుడు సెల్‌ టవర్‌ ఎక్కి నిరసన వ్యక్తం చేసిన ఘటన బుధవారం కలకలం రేగింది. కాగా మంగళవారం తన సోదరుడు చనిపోవడంతో ఒక వర్గం పెద్దలు స్మశానంలోకి అనుమతించకపోవడంతో మనస్తాపం చెంది సెల్‌ టవర్‌ ఎక్కినట్లు సమాచారం. ఈ క్రమంలో శ్మశాన వాటికలపై కూడా కుల రాజకీయం చేస్తున్నారని అతడు ఆరోపించాడు. కాగా హిందూ స్మశాన వాటికను కాస్త కుల స్మశాన వాటికగా బోర్టు మార్చి ఇతరులను అనుమతించకుండ అడ్డుకుంటున్నారని సదరు యువకుడు ఆవేదన వ్యక్తం చేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top