25 నుంచి షర్మిల పర్యటన

25 నుంచి షర్మిల పర్యటన - Sakshi


సాక్షి, విజయవాడ :  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో భాగంగా వైఎస్ జగన్ సోదరి షర్మిల ఈ నెల 25 నుంచి మూడు రోజులపాటు జిల్లాలో పర్యటించనున్నారు. 25న సాయంత్రం జిల్లాకు చేరుకుని తొలిరోజు ఉయ్యూరు, పెడనలో ప్రచారం నిర్వహిస్తారు. 26న నూజివీడు, తిరువూరు, నందిగామ, 27న జగ్గయ్యపేట, విజయవాడలో పర్యటిస్తారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను, ప్రోగ్రాం కమిటీ కోఆర్డినేటర్ తలశిల రఘురామ్ ఈ విషయం వెల్లడించారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top