మహిళా రైతు ఆత్మహత్య | Woman farmer commits suicide | Sakshi
Sakshi News home page

మహిళా రైతు ఆత్మహత్య

Dec 27 2015 4:32 PM | Updated on Nov 6 2018 7:56 PM

అప్పుల బాధ భరించలేక మహిళా రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన కర్నూలు జిల్లా కౌటాలం మండలంలో ఆదివారం చోటుచేసుకుంది.

కౌటాలం (కర్నూలు) : అప్పుల బాధ భరించలేక మహిళా రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన కర్నూలు జిల్లా కౌటాలం మండలంలో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న రంజానమ్మ(46) తనకున్న ఏడెకరాల భూమిలో ఐదెకరాలలో పత్తి, మరో రెండెకరాలలో మిర్చి సాగు చేసింది.

ఈ క్రమంలో పంటల పెట్టుబడుల కోసం తెచ్చిన అప్పులు పెరిగిపోవడంతో.. మనస్తాపానికి గురై ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement