బందోబస్తుతో ఎందుకు తిరగాల్సివస్తోంది? | why tdp leaders visit villages with police force, says tammineni sitaram | Sakshi
Sakshi News home page

బందోబస్తుతో ఎందుకు తిరగాల్సివస్తోంది?

Oct 27 2014 6:20 PM | Updated on Sep 2 2018 4:48 PM

తమ్మినేని సీతారాం(ఫైల్) - Sakshi

తమ్మినేని సీతారాం(ఫైల్)

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసమర్థత కారణంగా రాష్ట్ర రైతులు కుదేలయ్యారని వైఎస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి తమ్మినేని సీతారాం విమర్శించారు.

శ్రీకాకుళం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసమర్థత కారణంగా రాష్ట్ర రైతులు కుదేలయ్యారని వైఎస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి తమ్మినేని సీతారాం విమర్శించారు. టీడీపీ ప్రభుత్వం చేతగానితనంతో అన్నదాతలకు కనీసం పంటల బీమా కూడా లేకుండా పోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఫించన్లు ఐదు రెట్లు పెంచితే పాలకవర్గాలు పోలీసుల బందోబస్తుతో గ్రామాల్లో తిరగాల్సిన దుస్థితి ఎందుకు వచ్చిందని ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు.  ప్రజాధనాన్ని టీడీపీ కార్యకర్తలకు దోచి పెడుతున్నారని ఆరోపించారు.

Advertisement
 
Advertisement
Advertisement