పుట్టపర్తి విమానాశ్రయాన్ని కొంటాం | We will buy Puttaparthi airport | Sakshi
Sakshi News home page

పుట్టపర్తి విమానాశ్రయాన్ని కొంటాం

Sep 2 2016 1:37 AM | Updated on Nov 9 2018 5:56 PM

పుట్టపర్తి విమానాశ్రయాన్ని కొంటాం - Sakshi

పుట్టపర్తి విమానాశ్రయాన్ని కొంటాం

పుట్టపర్తి విమానాశ్రయాన్ని కొనుగోలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది.

శ్రీసత్యసాయి సెంట్రల్ ట్రస్టుకు రాష్ట్ర ప్రభుత్వం లేఖ

 సాక్షి ప్రతినిధి, కర్నూలు: పుట్టపర్తి విమానాశ్రయాన్ని కొనుగోలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. రూ.73 కోట్లు చెల్లించేందుకు ముందుకు వచ్చింది. ఈ మేరకు శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్టు సభ్య కారద్యర్శి కె.చక్రవర్తికి రాష్ట్ర మౌలిక సదుపాయాల సంస్థ(ఇన్‌క్యాప్) మేనేజింగ్ డెరైక్టర్ రమేశ్ కుమార్ సుమన్ రెండు రోజుల క్రితం లేఖ రాశారు. అయితే ఈ లేఖపై సత్యసాయి ట్రస్టు ఇంకా స్పందించాల్సి ఉంది. పుట్టపర్తి సాయిబాబా మరణానంతరం విమానాశ్రయానికి ప్రయాణికుల రద్దీ తగ్గిపోయింది.

విమాన సర్వీసులు కూడా నడవని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో పుట్టపర్తి విమానాశ్రయాన్ని విక్రయించాలని శ్రీసత్యసాయి సెంట్రల్ ట్రస్టు నిర్ణయించింది. ఈ నేపథ్యంలో రాష్ర్ట ప్రభుత్వం రూ.73 కోట్లకు కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చింది.పుట్టపర్తి విమానాశ్రయాన్ని కొనుగోలు చేయడం ద్వారా అక్కడ ఏవియేషన్ అకాడమీతో పాటు పెలైట్ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement