ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థుల గల్లంతు | Two students missing in Tungabhadra drainage canal | Sakshi
Sakshi News home page

ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థుల గల్లంతు

Aug 29 2015 3:50 PM | Updated on Sep 3 2017 8:21 AM

ఈతకు వెళ్లిన ఇద్దరు విద్యార్థులు గల్లంతయ్యారు. ఈ సంఘటన గుంటూరు జిల్లా బాపట్ల నియోజకవర్గం పిట్లవారిపాలెంలో శనివారం జరిగింది.

బాపట్ల (గుంటూరు) : ఈతకు వెళ్లిన ఇద్దరు విద్యార్థులు గల్లంతయ్యారు. ఈ సంఘటన గుంటూరు జిల్లా బాపట్ల నియోజకవర్గం పిట్లవారిపాలెంలో శనివారం జరిగింది. ఈ రోజు సెలవు రోజు కావడంతో ఆడుకుంటున్న విద్యార్థులు తుంగభద్ర డ్రైనేజి కాలువలో పడి గల్లంతయ్యారు.

కాగా విద్యార్థుల కేకలు విన్న కొందరు స్థానికులు వారి ఆచూకీ కోసం వెతుకుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. కాగా విద్యార్థుల వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement