ట్రాక్టర్కు విద్యుత్ షాక్.. కూలీల మృతి? | tractor gets electric shock, workers feared dead | Sakshi
Sakshi News home page

ట్రాక్టర్కు విద్యుత్ షాక్.. కూలీల మృతి?

Jan 31 2014 1:36 PM | Updated on Sep 5 2018 2:26 PM

ప్రకాశం జిల్లాలో దారుణం జరిగింది. కనిగిరి మండలం విశ్వనాథపురంలో ట్రాక్టర్కు విద్యుత్ షాక్ తగిలి పలువురు కూలీలు మరణించారు.

ప్రకాశం జిల్లాలో దారుణం జరిగింది. కనిగిరి మండలం విశ్వనాథపురంలో ట్రాక్టర్కు విద్యుత్ షాక్ తగిలి పలువురు కూలీలు మరణించారు. పొగాకు కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్కు విద్యుత్ షాక్ తగిలింది. దీంతో అందులో ఉన్న కూలీలు ఎటూ తప్పించుకోడానికి అవకాశం లేకుండా పోయింది.

ప్రమాదం సంభవించే సమయానికి ట్రాక్టర్లో దాదాపు 15 మంది కూలీలు ప్రయాణిస్తున్నట్లు తెలిసింది. అయితే ఇందులో ఎంతమంది క్షేమంగా బయటపడగలిగారో మాత్రం ఇంకా తెలియరాలేదు. మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement