ఆర్డీఓ సమక్షంలో వైఎస్సార్ సీపీ, టీడీపీ నేతల వాగ్వాదం
కళ్యాణదుర్గం : రైల్వేలైన్లో భూములు కోల్పోయిన రైతులకు పరిహారం విషయంపై వైఎస్సార్ సీపీ, టీడీపీ నేతల మధ్య వాగ్వాదం ఆర్డీఓ కార్యాలయంలో సోమవారం జరిగింది. వివరాల్లోకివెళ్తే... టీడీపీ నేతలు పాపంపల్లి రామాంజినేయులు, పురుషోత్తం తదితరులు ఆర్డీఓ రామారావుతో కార్యాలయంలో మాట్లాడుతున్నారు. అదే సమయంలో వైఎస్సార్ సీపీకి చెందిననారాయణపురం సర్పంచ్ సుగుణ భర్త వెంకటేశులు మరో 20 మంది రైతులు పరిహారం కోసం ఆర్డీఓను కలిసేందుకు వెళ్లారు.
కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఆర్డీఓలు మూడు సార్లు రైతులతో సమన్వయ సమావేశం నిర్వహించి, అన్ని భూములకు ఒకే తరహా పరిహారం ఇస్తామని చెప్పారని, ఇప్పుడు మరో రకంగా మాట్లాడుతున్నారని ఆర్డీవో దృష్టికి తెచ్చారు. ఇప్పటికే పలుమార్లు ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లిన ఫలితం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడే ఉన్న టీడీపీ నేతలు రామాంజినేయులు, పురుషోత్తం జోక్యం చేసుకుంటూ ఇదంతా ఎన్నికల ముందు లబ్ధి కోసం మాజీ మంత్రి రఘువీరారెడ్డి రైల్వే టెండర్లు పిలిపించి రైతులకు అన్యాయం చేశారని ఆరోపించారు.
దీంతో ఆగ్రహించిన వైఎస్సార్ సీపీ నేతలు వెంకటేశులు, తదితరులు ఎన్నికల గురించి ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం లేదని, తాము ఆర్డీఓతో మాట్లాడుతుంటే ఎందుకు జోక్యం చేసుకుంటున్నారని ప్రశ్నించారు. దీంతో ఇరుపార్టీల నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది. మీరంటే మీరే రైతులకు అన్యాయం చేస్తున్నారంటూ ఆరోపణలు చేసుకున్నారు. దీంతో ఆర్డీఓ కార్యాలయం వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. ఆర్డీఓ సైతం నేతల తీరుపై అసహనం వ్యక్తం చేశారు.
ఈ విషయం తెలుసుకున్న టౌన్ ఎస్ఐ జయనాయక్ ఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాలను అక్కడి నుంచి పంపించివేశారు. సమాచారం అందుకున్న టీడీపీ జెడ్పీటీసీ కొల్లాపురప్ప, మాజీ సర్పంచ్ కొల్లప్ప, వైస్ ఎంపీపీ వెంకటేశులు, ములకనూరు కిష్టాతో పాటు మరో 50 మంది రైతులు ఆర్డీఓ కార్యాలయానికి చేరుకుని నిరసన తెలిపారు. రైతులకు పరిహారం ఇచ్చేదాక రైల్వే పనులు చేయనియబోమని స్పష్టం చేశారు.
వైఎస్సార్ సీపీ నేతలు, రైతులు ఆందోళనకు దిగడంతో ఆర్డీఓ కార్యాలయం గందరగోళంగా మారింది. చివరికి జోక్యం చేసుకున్న ఆర్డీఓ రెవెన్యూ చట్టప్రకారం ప్రభుత్వం నుంచి బాధిత రైతులకు వచ్చే పరిహారాన్ని అందజేస్తామని, ఇందులో రాజకీయాలకు సంబంధం లేదన్నారు. ఇప్పటికే పరిహారం కోసం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని, ఈ విషయాన్ని మరోసారి పైఅధికారులకు తెలియజేస్తామని హామీ ఇచ్చారు.
రైల్వే భూ పరిహారంపై వివాదం
Published Tue, Jan 20 2015 2:38 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
విడుదలకు సిద్దమైన సైన్స్ ఫ్రిక్షన్ థ్రిల్లర్ ‘దర్శిని’
బాకీ తీర్చలేదని బట్టలూడదీసి.. మర్మాంగాల మీద తన్నుతూ..
20 ఏళ్లయినా అదే క్రేజ్.. స్టేజీపై అదరగొట్టేసింది!
రచ్చ శ్రీను కేరాఫ్ తాడేపల్లిగూడెం
విశాఖపై టీడీపీ కొత్తరాగం
తెలంగాణలో ‘RR’ ట్యాక్స్పై చర్చ నడుస్తోంది: ప్రధాని మోదీ
పేదలపై చంద్రబాబు పెత్తందారీ కుట్ర
పాక్తో రాహుల్కు సంబంధం ఏంటి: స్మృతి ఇరానీ
ఉద్యోగం దొరికితే చాలు అనే యువతరం కాదు..అంతకుమించి..!
Regina Cassandra: టాలీవుడ్ క్యూట్ బ్యూటీ రెజీనా (ఫొటోలు)
తప్పక చదవండి
- బాకీ తీర్చలేదని బట్టలూడదీసి.. మర్మాంగాల మీద తన్నుతూ..
- ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు కొట్టిన సంజూ.. భారత తొలి క్రికెటర్గా..
- దుబాయ్ నుంచి సెలవుపై వచ్చి ఆంబులెన్స్ ఢీ కొట్టి..
- ఎన్నికల బరిలో బిగ్ బాస్ ‘ఖాన్’.. ఎవరితో సై అంటున్నారు?
- Rafah: ఇజ్రాయెల్ దుందుడుకు చర్య.. ఐరాస ఆందోళన
- Arya 20 Years Celebrations: ‘ఆర్య’ సినిమా 20 ఇయర్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
- లగ్జరీ కారు కొనుగోలు చేసిన బుల్లితెర నటి..!
- AP: పిడుగులుపడి ఏడుగురు మృత్యువాత
- Telangana: మరో రెండు రోజులు వానలు
- ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
Advertisement