శేషాచలం ఎన్కౌంటర్ కేసు విచారణ 24కి వాయిదా | tirupati sheshachalam encounter case postponed on april 24th | Sakshi
Sakshi News home page

శేషాచలం ఎన్కౌంటర్ కేసు విచారణ 24కి వాయిదా

Apr 22 2015 11:57 AM | Updated on Aug 31 2018 9:15 PM

తిరుపతి శేషాచలం ఎన్కౌంటర్ కేసుపై విచారణను హైకోర్టు ఎల్లుండికి వాయిదా వేసింది. మరోవైపు ఈ కేసులో ..

హైదరాబాద్ : తిరుపతి శేషాచలం ఎన్కౌంటర్ కేసుపై విచారణను హైకోర్టు ఎల్లుండికి వాయిదా వేసింది.  కోర్టు ఆదేశాల మేరకు మృతులకు పోస్టుమార్టం నిర్వహించిన ఉస్మానియా వైద్యులు బుధవారం ఆ నివేదికను కోర్టుకు సమర్పించారు. అంతకుముందు నిమ్స్‌ వైద్యుల పర్యవేక్షణలో ఫోరెన్సిక్ నిపుణులైన డాక్టర్ల బృందంతో మృతదేహాలకు మరోసారి శవపరీక్ష నిర్వహించారు.

 

ఆ పోస్టుమార్టం నివేదికను తమకు మాత్రమే ఇవ్వాలన్న ఆదేశాల మేరకు సీల్డు కవర్‌లో నివేదికను న్యాయస్థానానికి సమర్పించారు. ఈ నెల 9వ తేదీన చిత్తూరు జిల్లా శేషాచలం అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో 20 మంది తమిళనాడుకు చెందిన కూలీలు మృతి చెందిన సంగతి తెలిసిందే.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement