ఇదీ మరుగుదొడ్ల నిర్మాణం తీరు
లక్ష్యం 1,73,418
పూర్తయినవి 20,266
స్వచ్ఛభారత్లో పూర్తి చేయాల్సినవి 75 వేలు
ఉపాధిహామీ ద్వారా మరో 18 వేలు
మచిలీపట్నం : జిల్లాలో మరుగుదొడ్ల నిర్మాణం నత్తనడకన సాగుతోంది. గత ఏడాది అక్టోబర్ 2వ తేదీన ఆర్భాటంగా ప్రారంభించిన స్వచ్ఛభారత్ కార్యక్రమం పాలకులు, అధికారుల నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనంగా మారింది. పారిశుధ్య చర్యలను మెరుగుపరిచేందుకు జిల్లా వ్యాప్తంగా 1.73 లక్షల మరుగుదొడ్లను నిర్మించాలని పరిపాలనా ఆమోదం తెలిపారు. దీంట్లో మొదటి విడతగా స్వచ్ఛభారత్ కార్యక్రమం ద్వారా ఆర్డబ్ల్యూఎస్ అధికారుల పర్యవేక్షణలో 75 వేల మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేయాలని నిర్ణయించారు. జిల్లాలో 970 పంచాయతీలు ఉండగా వాటిలో 96 పంచాయతీల్లో మరుగుదొడ్లను నిర్మించే బాధ్యతను ఉపాధి హామీ పథకం అధికారులకు అప్పగించారు. 18 వేల మరుగుదొడ్లు నిర్మించాలని లక్ష్యంగా నిర్ణయించారు. బుధవారం కలెక్టర్ నిర్వహించిన వీడియోకాన్ఫరెన్స్లో గ్రామాల వారీగా ఎన్ని మరుగుదొడ్లు నిర్మించాల్సి ఉంటుంది వివరాలు తీసుకున్నారు. గత ఏడాది ప్రారంభమైన ఈ పథకం మళ్లీ అక్టోబర్ వచ్చే నాటికి వివరాలు తీసుకునేందుకు మాత్రమే పరిమితం కావడం గమనార్హం.
గోరంత ఫలితం
జిల్లాలో 1,73,418 మరుగుదొడ్లు నిర్మించాలని లక్ష్యంగా నిర్ణయించగా ఇప్పటి వరకు 20,266 మరుగుదొడ్ల నిర్మాణం మాత్రమే పూర్తి చేసినట్లు అధికారులు చెబుతున్నారు. తమ పర్యవేక్షణ లోని 19 వేల మరుగుదొడ్లు వివిధ దశల్లో ఉన్నాయని ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ రాంగోపాల్ తెలి పారు. ఉపాధి హామీ పథకం ద్వారా 1,266 మరుగుదొడ్ల నిర్మాణం పూర్తిచేశారు. ఉపాధి పథకం ద్వారా 18 వేల మరుగుదొడ్లు నిర్మించాలని లక్ష్యంగా నిర్ణయింగా 1,266ను పూర్తి చేసి 3,150 మరుగుదొడ్లు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నట్లు డ్వామా పీడీ మాధవీలత తెలిపారు.
బిల్లులు చెల్లింపులో జాప్యం
ఒక్కొక్క మరుగుదొడ్డికి తొలుత రూ.12 వేలు చెల్లిస్తామని ప్రకటించారు. ఈ నగదు మరుగుదొడ్ల నిర్మాణానికి సరిపోదని ప్రజల నుంచి వినతులు రావటంతో ఈ మొత్తాన్ని రూ. 15 వేలకు పెంచారు. మరుగుదొడ్డి మంజూరు కావాలంటే రేషన్, ఆధార్కార్డులు, ఇంటికి సంబంధించిన వివరాలు, పంచాయతీ కార్యదర్శి ఆమోదం తదితరాలను సేకరించాలి. రేషన్కార్డులో, ఆధార్కార్డులో కుటుంబ యజమాని పేరు ఒక్క అక్షరం తప్పుగా నమోదైనా మరుగుదొడ్డి నిర్మాణానికి అనర్హులుగా ప్రకటిస్తున్నారు. లబ్ధిదారులు ముందుకు వచ్చి మరుగుదొడ్డి నిర్మిస్తే బిల్లుల చెల్లింపు కోసం నెలల తరబడి కార్యాలయం చుట్టూ తిప్పుకుంటున్నారు. ఆన్లైన్ ద్వారానే నగదు చెల్లింపులు ఉంటాయని చెబుతున్నా సకాలంలో నగదు ఇవ్వని పరిస్థితి ఉంది.
నత్తే నయం
Published Sat, Sep 26 2015 12:30 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
సమంత షాకింగ్ పోస్ట్.. పెట్టి డిలీట్ చేసిందా?
రాహుల్ తెలంగాణ మహిళలకు క్షమాపణలు చెప్పాలి: హరీశ్రావు
కేకేఆర్తో లక్నో పోరు.. తుది జట్లు ఇవే! స్టార్ బౌలర్ దూరం
జడేజా ఆల్రౌండ్ షో.. పంజాబ్ను చిత్తు చేసిన సీఎస్కే
సీను సీతారైంది సాంబడా
తప్పక చదవండి
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement