'బాబూరావుపై కేసు పెట్టాలని కమిటీ చెప్పలేదు' | Sakshi
Sakshi News home page

'బాబూరావుపై కేసు పెట్టాలని కమిటీ చెప్పలేదు'

Published Fri, Aug 28 2015 7:13 PM

'బాబూరావుపై కేసు పెట్టాలని కమిటీ చెప్పలేదు'

హైదరాబాద్:ఇటీవల ఆచార్య నాగార్జన యూనివర్శిటీ(ఏఎన్ యూ)లో ఆత్మహత్యకు పాల్పడిన రిషితేశ్వరి కేసులో విచారణ నివేదికను ఇంకా బహిర్గత పరచలేదని మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఆ ఘటనకు సంబంధించి ఏం చేయాలో అనేది దానిపై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదన్నారు.

 

కాగా, ఈకేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రిన్సిపాల్ బాబూరావుపై కేసు పెట్టారా?అని మీడియా అడిగిన ప్రశ్నకు మాత్రం గంటా తనదైన శైలిలో సమాధానమిచ్చారు. బాబురావుపై కేసు పెట్టాలని బాలసుబ్రహ్మణ్యం కమిటీ తమకు సూచించలేదన్నారు.

Advertisement
Advertisement