తాగు నీరు లేక చిరుత పులి మృతి | Sakshi
Sakshi News home page

తాగు నీరు లేక చిరుత పులి మృతి

Published Wed, Mar 23 2016 11:11 AM

తాగు నీరు లేక చిరుత పులి మృతి - Sakshi

ఎండల తీవ్రత పెరిగి.. తాగు నీరు అందని పరిస్థితుల్లో మూగ జీవాలు ప్రాణాలు కోల్పోతున్నాయి. కర్నూలు జిల్లా రుద్రవరం మండలం కోటకొండ అటవీ ప్రాంతంలో ఇలానే ఓ చిరుత పులి మృతి చెందింది. స్థానికులు బుధవారం ఉదయం చూసి అటవీ అధికారులకు సమాచారం చేరవేశారు. డీఎఫ్‌వో శివప్రసాద్ సిబ్బందితో కలసి చనిపోయిన చిరుత పులిని పరిశీలించారు. తాగు నీరు లభించక మూడు రోజుల క్రితమే మృతిచెంది ఉంటుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.

 

Advertisement
Advertisement