♦ ఆలస్యంగా వెలుగులోకివచ్చి ఘటన
♦ నర్సు,ఎఎన్ఎంలపై ఫిర్యాదు
♦ డిప్యూటీ డీఎహెచ్వో విచారణ
నక్కపల్లి : ప్రసవ సమయంలో నర్సు, ఏఎన్ఎంలు చేసిన వైద్యం వికటించి ఓ బాలింత మృత్యువాతపడిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బంధువులు ఫిర్యాదుతో శనివారం డిప్యూటీ డీఎంహెచ్వో, అగనంపూడి ఏరియా ఆస్పత్రి వైద్యాధికారి డాక్టర్ పి రాధారాణి గొడిచర్ల పీహెచ్సీలో విచారణ చేపట్టారు. మృతురాలి తల్లి లక్ష్మి ,భర్త శ్రీను విచారణాధికారికి ఇచ్చిన వాంగ్మూలం, విలేకర్లకు తెలిపి వివరాలిలా..మండలంలోని రాజయ్యపేటకు చెందిన మైలపల్లి అరుణ(25) రెండోకాన్పు కోసం పుట్టింటికి వచ్చింది. నొప్పులు రావడంతో గతనెల 16నఅర్ధరాత్రి దాటాక ఏఎన్ఎం వెంకటలక్ష్మి ఆమెను గొడిచర్ల పీహెచ్సీకి తరలించారు. డాక్టర్ లేకపోవడంతో స్టాప్నర్సు స్వరూపతో కలిసి పురుడుపోశారు. మగబిడ్డపుట్టాడు. ఈ క్రమంలో ఆమె విపరీతమైన రక్తస్రావానికి గురైంది. అపస్మార క స్థితికి చేరింది.
దీంతో తుని పెద్దాసుపత్రికి తరలించాలని కుటుంబ సభ్యులు వేడుకున్నా వినకుండా తునిలోని ప్రయివేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. వారు ఆపరేషన్కు రూ.30వేలు అవుతుందన్నారు. మొదటి విడతగా రూ.10వేలు చెల్లించారు. ఆపరేషన్చేసినా పరిస్థితి కుదుట పడలేదు. అరుణకు కిడ్నీలు పాడయ్యాయని.. డయాలసిస్ కోసం వెంటనే మరో పెద్దాసుపత్రికి తీసుకెళ్లాలన్నారు. కేజీహెచ్కు వెళ్తామని కుటుంబ సభ్యులంటున్నా వినకుడా కాకినాడలోని సూర్య గ్లోబల్ ఆస్పత్రికి రిఫర్ చేశారు. అక్కడ మూడురోజులు వైద్యం చేసి రూ.1.36లక్షలు బిల్లు చేశారు. తర్వాత కిడ్నీల కోసం హైదరాబాద్నిమ్స్కి గాని, విశాఖసెవెన్హిల్స్లో గాని చేర్చాలని సూచించారు. వెంటనేసెవెన్హిల్స్కు తీసుకెళ్తే నిరాకరించారు. తర్వాత కేజీహెచ్లో జాయిన్ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ గత నెల 26న అరుణ మరణించిందని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా వాపోయారు. అరుణకు రెండేళ్లపాప, రెండునెలల బాబు ఉన్నారు.
నర్సు, ఏఎన్ఎంలు ఆదిలో వ్యవహరించిన తీరు..ప్రయివేట్ ఆస్పత్రుల ధనాకాంక్ష అరుణను బలిగొన్నాయని వారు ఆరోపించారు. అన్యాయంపై తిరిగి తనపై ఏఎన్ఎం పోలీసుకేసు పెట్టారన్నారు. ఏఎన్ఎం,నర్సులపై తక్షణమే కేసు నమోదు చేసి న్యాయం చేయాలని కోరుతున్నారు. విచారణాధికారి రాధారాణి మాట్లాడుతూ ఇరుపక్షాలనుంచి వాంగ్మూలం సేకరించామన్నారు.
వైద్యం వికటించి బాలింత మృతి
Published Sun, Jul 19 2015 1:36 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
జ్వరంతో బాధపడుతున్నారు.. అయినా అదరగొట్టారు: రుతురాజ్
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
అభిమానిపై చేయి చేసుకున్న డీకే శివకుమార్
పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
నరైన్ విధ్వంసం.. లక్నో ముందు భారీ టార్గెట్
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement