వాహన వేగాన్ని నియంత్రించే స్పీడ్బ్రేకర్లు, స్టాపర్లు
సాలూరు: గతంలో ఎన్నడూ లేనివిధంగా నేరాలు, రోడ్డు ప్రమాదాలు జరగకుండా చేయడంతోపాటు, ఒకవేళ సంభవిస్తే బాధ్యులను త్వరితగతిన గుర్తించేలా చేసేందుకు వీలుగా పోలీసులు పలు చర్యలు తీసుకుంటున్నారు. ఇటీవలే సీఐగా బాధ్యతలు స్వీకరించిన జి.రామకృష్ణ ఈదిశగా ఆలోచన చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే పలు చర్యలు కార్యరూపం దాల్చగా ఇంకొన్ని ఆలోచనలు ఆచరణలోకి రావాల్సి ఉంది. దీంతో పోలీసుల చర్యలపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
జాతీయ రహదారిపై సీసీ కెమెరాలు
26వ నంబరు జాతీయ రహదారిపై స్థానిక తహశీల్దార్ కార్యాలయ జంక్షన్లో మూడు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. దీనివల్ల జాతీయ రహదారిపై రాకపోకలు సాగించే వాహనాలను గుర్తించడంతో రోడ్డు ప్రమాదాలు, అక్రమరవాణా చేసే వాహనాలను సునాయాసంగా గుర్తించే అవకాశం కలుగుతుందని సీఐ రామకృష్ణ భావిస్తున్నారు. అంతేకాకుండా పట్టణంలో రహదారులు ఇరుగ్గా ఉండడంతో ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకునేందుకు కూడా అవకాశం ఉంటుందని చెబుతున్నారు. అంతేకాకుండా పోలీసుల పనితీరుపై కూడా తమ శాఖ నిఘా పెట్టేందుకు దోహదపడుతుందంటున్నారు.
వేగ నియంత్రణకు
వాహన వేగాన్ని నియంత్రించేందుకు, తద్వారా రోడ్డు ప్రమాదాల నివారణకు వీలుగా జాతీయ రహదారిపై పలుచోట్ల స్పీడ్ బ్రేకర్లు, స్టాపర్లను ఏర్పాటు చేశారు. గాంధీనగర్వద్ద వన్ వే ట్రాఫిక్ మార్గంపై స్పీడ్ బ్రేకర్లను నిర్మించారు. అలాగే కాస్త ముందుగా జాతీయ రహదారిపైన, ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలోను స్టాపర్లను ఏర్పాటు చేశారు. దీనివల్ల సత్ఫలితం వస్తుందని భావిస్తున్నారు.
త్వరలో జీపీఎస్ ఫోన్లు
అలాగే నోపార్కింగ్ బోర్డులు కూడా ఏర్పాటు చేయనుండడంతో పాటు రాత్రివేళ విధులు నిర్వర్తించే పోలీసులకు, ట్రాఫిక్ నియంత్రణకు వెళ్లే వారిపై ఒక కన్నేసేలా చేసేందుకు ఉపకరించే జీపీఎస్ ఫోన్లను వినియోగంలోకి తేనున్నారు. దీనివల్ల ఏసమయంలో ఎక్కడ ఉన్నారో ఇట్టే తెలుసుకోవడం సాధ్యమంటున్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని నేరాలు, ప్రమాదాల అదుపునకు, చోటివ్వకుండా చర్యలు తీసుకోవడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
హైవేపై సీసీ కెమెరాలతో నిఘా
Published Sat, Mar 14 2015 1:57 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేనేమి పాపం చేశానమ్మా..!
ఆదిలాబాద్ నుంచే షురూ
ఈవీఎం కమిషనింగ్ సమర్థవంతంగా చేపట్టాలి
పని వేళలు మార్చాలని సీఎండీకి వినతి
కొనసాగుతున్న పోస్టల్ బ్యాలెట్
నిరుద్యోగ సమస్య తీరుస్తా
గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ మోసం
వాహనాలు సిద్ధం
భూగర్భ జలాలు.. మరింత దిగువకు
● ఆర్థికంగా ఉన్న కుటుంబానికే అవకాశాలు ● కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల మధ్య సహకారం ● కార్మిక నేతగా ఇక్కడి సాధకబాధలు తెలుసు ● పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలంతా ఆలోచించాలి ● ‘సాక్షి’తో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement