కర్నూలు జిల్లా మంత్రాలయంలో కొలువైన శ్రీరాఘవేంద్రస్వామిని తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి ఆదివారం ఉదయం దర్శించుకున్నారు.
మంత్రాలయం (కర్నూలు జిల్లా) : కర్నూలు జిల్లా మంత్రాలయంలో కొలువైన శ్రీరాఘవేంద్రస్వామిని తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి ఆదివారం ఉదయం దర్శించుకున్నారు. తొలుత ఆయన గ్రామదేవత మాంచాలమ్మను దర్శించి పూజలు నిర్వహించారు.
అనంతరం శ్రీరాఘవేంద్రస్వామి మూల బృందావనాన్ని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆయనకు శ్రీపీఠం పీఠాధిపతి శేషవస్త్రం సమర్పించి ఆశీస్సులు అందజేశారు.