ఉపాధ్యాయులకు కొత్త చిక్కు వచ్చింది. సెలవుల్లో సరదాగా గడుపుతున్న టీచర్లకు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. మంగళవారం నుంచి సమ్మేటివ్-1 పరీక్షలు ప్రారంభమవుతుండగా పాఠశాల స్థాయిలో చేయాల్సిన జన్మభూమి-మా ఊరు కార్యక్రమం రోజూవారీ షెడ్యూల్ ప్రకటించారు. రెండూ జరపాల్సిందేనని డీఈవో, ఎస్ఎస్ఏ పీవోలు ఆదేశాలు ఇచ్చారు. రెండింటినీ ఎలా సమన్వయం చేసుకోవాలిరా దేవుడా అని ఉపాధ్యాయులు అయోమయంలో పడిపోయారు. పరీక్షలైనా వాయిదా వేయాలని లేదా ఉపాధ్యాయులను జన్మభూమి నుంచి మినహాయించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
చిత్తూరు(ఎడ్యుకేషన్): జన్మభూమి గురువారం నుంచి ప్రారంభమవుతున్నా పాఠశాలలకు 6వ తేదీ వరకు దసరా సెలవులు ఉండటంతో ఈ నెల 7న మంగళవారం నుంచి పాఠశాల స్థాయిలో కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశాలు ఇచ్చారు. గతంలో ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం మంగళవారం నుంచి సమ్మేటివ్-1 పరీక్షలు ప్రారంభమవుతున్నాయి. ప్రాథమిక పాఠశాలల విద్యార్థులకు 10వ తేదీ వరకు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరగుతాయి. ఉన్నత పాఠశాలల విద్యార్థులకు 14వ తేదీ వరకు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు జరుగుతాయి. తెలుగు-2, ఇంగ్లిష్-2, ఎన్ఎస్-2 పరీక్షలు మధ్యాహ్నం జరుగుతాయి. డీఈవో, ఎస్ఎస్ఏ అధికారులు జన్మభూమి నేపథ్యంలో ఈనెల 20వ తేదీ వరకు రోజువారీగా చేయాల్సిన కార్యక్రమాల షెడ్యూల్ ఇచ్చారు. పాఠశాల స్థాయిలో కార్యక్రమాలు చేయాల్సి ఉంటుంది. వీటిలో ఉపాధ్యాయులు పాల్గొనాల్సి ఉంటుంది.
సమన్వయం కుదురుద్దా?
అధికారులు చెబుతున్న దాని ప్రకారం పరీక్ష అయిన తర్వాత జన్మభూమి కార్యక్రమాలు చేయాల్సి ఉంటుంది. అయితే ప్రజాప్రతినిధులను ఆహ్వానించి కార్యక్రమాలు చేయాలని చెప్పడంతో ఎక్కువగా ఉదయమే జరపాలి. ఉదయం పరీక్షలు ఉంటాయి. రెండూ ఏక కాలంలో చేయడం సాధ్యం కాదు. ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు కార్యక్రమాల ఏర్పాట్లలో బిజీగా ఉంటారు. పరీక్షల షెడ్యూల్ మధ్యాహ్నానికి మార్చుకుంటే లేదా జన్మభూమిలో పాఠశాలలను మినహాయిస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కార్యక్రమం కాబట్టి జన్మభూమి విషయంలో వెనక్కు తగ్గే సూచనలు కనిపించడంలేదు.
ప్రభుత్వం ఇబ్బంది పెట్టకుండా చేయాలి
పరీక్షలు, జన్మభూమి కార్యక్రమాలు ఏకకాలంలో జరగడం అసంభవం. ఉపాధ్యాయులు పరీక్షలకు అధిక ప్రాధాన్యత ఇస్తే ప్రజాప్రతినిధుల కోపానికి బలి కావాల్సి ఉంటుంది. పరీక్షలు జరపకపోతే విద్యార్థులు ఇబ్బందులు పడుతారు. ప్రభుత్వం ఆలోచించి షెడ్యూల్ ఇస్తే బాగుంటుంది.
-వీ.రెడ్డిశేఖర్రెడ్డి, వైఎస్సార్ టీఎఫ్ రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సభ్యులు
పరీక్షలా..జన్మభూమా!
Published Tue, Oct 7 2014 12:55 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు ఎస్వీ డిగ్రీ కళాశాలకు ముగ్గురు కమిటీ సభ్యులరాక
No Headline
ఎన్నికల భారతం పుస్తకావిష్కరణ
వృత్తిదారుల మోములో ఆనందం...
ప్రతి సర్కిల్లో కంట్రోల్ రూం
హైదరాబాద్లో ఈదురుగాలులతో కూడిన భారీవర్షం (ఫొటోలు)
"పవన్ కళ్యాణ్ కు ఓటు వెయ్యం "..తేల్చి చెప్పిన పిఠాపురం టీడీపీ
రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలి
ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలి
‘మోసం చేసిన వారిపై చర్య తీసుకోవాలి’
తప్పక చదవండి
- లగ్జరీ కారు కొనుగోలు చేసిన బుల్లితెర నటి..!
- అవినీతి ‘కాలువ’
- పాతబస్తీలో పతంగేనా?
- నేడు ఏపీలో ప్రధాని ఎన్నికల ప్రచారం
- పిడుగులుపడి ఏడుగురు మృత్యువాత
- బీజేపీ ఖైదీగా శ్రీరాముడు
- కాంగ్రెస్, బీఆర్ఎస్కు ఓటేస్తే ఎవరు ప్రధాని అవుతారో తెలియదు
- ప్రమాదంలో ముస్లిం సమాజం
- నేడు వేములవాడకు మోదీ!
- Telangana: మరో రెండు రోజులు వానలు
Advertisement