Sakshi News home page

'అవినీతి రాజకీయాల్లో టీడీపీ నంబర్ వన్'

Published Tue, Jun 23 2015 1:47 PM

tdp number one of the corrupt politics says muthumula

ప్రకాశం: అవినీతి రాజకీయాలు చేయటంలో టీడీపీ నంబర్ వన్ స్థానంలో కొనసాగుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ లో ఓటుకు కోట్లు మరువక ముందే ఆంధ్రప్రదేశ్ లో కుటిల రాజకీయాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. తాజాగా ప్రకాశం జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందని ఎంపీటీసీ వెంకట్రావు కిడ్నాప్ నకు గురయ్యాడు. కాగా టీడీపీ నేతలే అతణ్ని కిడ్నాప్ చేసి ఉంటారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ముత్తుముల అశోక్ రెడ్డి తెలుగుదేశం ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement