టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారు | tdp list out mlc members | Sakshi
Sakshi News home page

టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారు

Jun 14 2015 8:06 PM | Updated on Aug 24 2018 2:36 PM

టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారు - Sakshi

టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారు

ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను ఖరారు చేసింది. ఎంపికలో ఇప్పటి వరకు జరిగిన జాప్యానికి తెరదించింది

హైదరాబాద్: ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను ఖరారు చేసింది. ఎంపికలో ఇప్పటి వరకు జరిగిన జాప్యానికి తెరదించింది. మొత్తం పన్నెండు స్ధానాల్లో 11 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. గుంటూరు జిల్లా టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా అన్నం సతీష్ ను ఖరారు చేశారు. ఇక్కడ రెండు ఎమ్మెల్సీలకు ఒక్కరినే ప్రకటించడం విశేషం.

ఇక విశాఖకు పప్పల చలపతిరావు, ఎంవీవీఎస్ మూర్తి, కృష్ణా జిల్లా టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా రాజేంద్ర ప్రసాద్, బుద్ధా వెంకన్న, విజయనగరం జిల్లా ఎమ్మెల్సీ అభ్యర్థిగా ద్వారపురెడ్డి జగదీశ్, తూర్పుగోదావరి జిల్లాకు రెడ్డి సుబ్రహ్మణ్యం, ప్రకాశం జిల్లా మాగుంట శ్రీనివాసులు రెడ్డి, చిత్తూరు జిల్లా గాలి ముద్దు కృష్ణమనాయుడు, అనంతపురం జిల్లా నుంచి పయ్యావుల కేశవ్, కర్నూలు జిల్లా నుంచి శిల్పా చక్రపాణి రెడ్డిని రంగంలోకి దించారు.  ఎమ్మెల్సీ సీట్లు ఆశిస్తున్న నేతలంతా హైదరాబాద్‌లో మకాం వేసి తమ ప్రయత్నాలు ముమ్మరం చేయగా చివరికి టీడీపీ తుది నిర్ణయం తీసుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement