దేశానికి కాలసర్పదోషం | Svarupanandendra Saraswati comments on country | Sakshi
Sakshi News home page

దేశానికి కాలసర్పదోషం

Feb 6 2017 1:38 AM | Updated on Aug 31 2018 8:31 PM

దేశానికి కాలసర్పదోషం - Sakshi

దేశానికి కాలసర్పదోషం

దేశానికి కాలసర్పదోషం ఉన్నందున రానున్న రోజుల్లో గడ్డుకాలం నడుస్తుందని విశాఖ శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి చెప్పారు.

స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ

పెందుర్తి: దేశానికి కాలసర్పదోషం ఉన్నందున రానున్న రోజుల్లో గడ్డుకాలం నడుస్తుందని విశాఖ శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి చెప్పారు. దాని నివారణకు హోమాలు, యజ్ఞాలు చేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. విశాఖ జిల్లా పెందుర్తి మండలం చినముషిడివాడలోని శారదాపీఠం వార్షికోత్సవ వేడుకలు ఆదివారం మూడో రోజు ఘనంగా జరిగాయి.

హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ యు.దుర్గాప్రసాదరావు, జస్టిస్‌ సీతారామమూర్తి, ఒలింపిక్స్‌ రజత పతక విజేత, ప్రఖ్యాత బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పి.వి సింధు, బ్యాడ్మింటన్‌ చీఫ్‌ కోచ్‌ పుల్లెల గోపిచంద్, బ్యాడ్మింటన్‌ సంఘం ప్రతినిధి చాముండేశ్వరీనా«థ్‌ తదితరులు ఈ వేడుకల్లో పాల్గొని ప్రత్యేక పూజలు జరిపారు. ఈ సందర్భంగా స్వామీజీ అనుగ్రహ భాషణ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement