
శ్రీవారి సేవలో ప్రముఖులు
తిరుమల శ్రీవారిని శనివారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు.
తిరుమల శ్రీవారిని శనివారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. కేంద్రమంత్రి సుజనాచౌదరి, రాష్ట్ర మంత్రి పల్లె రఘునాథరెడ్డి, జిల్లా మూడో అదనపు న్యాయమూర్తి రవీంద్రబాబు, విశాఖపట్నం రేంజ్ డీఐజీ ఉమాపతి, నిజామాబాద్ రేంజ్ డీఐజీ సూర్యనారాయణ, రైల్వే ట్రాఫిక్ బోర్డు సభ్యుడు దేవీ ప్రసాద్పాండీ, రైల్వే జీఎం ఎస్కే అగర్వాల్ ఉన్నారు. వీరికి ఆలయ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసి లడ్డూ ప్రసాదాలు అందజేశారు.