మార్కాపురం, న్యూస్లైన్: అక్షరాభ్యాసాన చిన్నారులు ఓనమాలు దిద్దే మార్కాపురం పలకకు కష్టకాలం వచ్చింది. కంప్యూటర్ల రాక, నోటు పుస్తకాల వాడకం పెరగడంతో పదేళ్ల నుంచి క్రమంగా రాతి పలకల వాడకం తగ్గిపోతోంది. దీంతో ఆ పరిశ్రమలూ మూతపడుతున్నాయి. కొంతమంది వ్యాపారులు వాటిని డిజైన్ స్లేట్లుగా మార్చి విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. అయితే ఈమధ్య కాలంలో విదేశాల నుంచి కూడా ఎగుమతి ఆర్డర్లు నిలిచిపోవడంతో పనులు దొరక్క పలకల ఫ్యాక్టరీల నిర్వహణ యజమానులకు భారంగా మారింది.
సవాలక్ష సమస్యలు
క్వారీల నిర్వహణలో కోర్టు కేసులు, పెరిగిన విద్యుత్ చార్జీలు, కూలీల వేతనాలు వెరసి ఫ్యాక్టరీల నిర్వహణ యజమానులకు భారంగా మారింది. 150 ఫ్యాక్టరీలకు గాను కేవలం 20 నుంచి 25 ఫ్యాక్టరీల్లో మాత్రమే ప్రస్తుతం పనులు జరుగుతున్నాయి. పలకల పరిశ్రమపై సుమారు 30 గ్రామాల్లోని 3 వేల మంది కూలీలు ఆధారపడి జీవిస్తున్నారు. ఫ్యాక్టరీలు మూతపడటంతో నెల రోజుల నుంచి కుటుంబ పోషణ భారంగా మారింది.
విస్తృత నిక్షేపాలు
తర్లుపాడు, మార్కాపురం, దొనకొండ మండలాల్లో సుమారు 15 కిలోమీటర్లు మేర పలకల గనులు విస్తరించి ఉన్నాయి. తర్లుపాడు మండలంలోని కలుజువ్వలపాడు, మేకలవారిపల్లె, చెన్నారెడ్డిపల్లె, తుమ్మలచెరువు, మార్కాపురం మండలంలోని నాయుడుపల్లె, రాయవరం, కందివారిపల్లె, గజ్జలకొండ, దొనకొండ మండలంలోని మంగినిపూడి తదితర గ్రామాల్లో పలకల గనులు ఎక్కువగా ఉన్నాయి. రోజూ సుమారు 3 వేల మంది కార్మికులు గనుల్లో పనిచేస్తుంటారు.
మార్కాపురం పలకలకు గతంలో విదేశాల్లో మంచి డిమాండ్ ఉండేది.
ప్రస్తుతం ఆదరణ తగ్గుతోంది. పలకల గనుల్లో విజయాగోల్డ్, మల్టీ కలర్, బ్లాక్, ఆటమ్ తదితర రకాల డిజైన్ స్లేట్లు వస్తుంటాయి. ఒక్కో గనిలో నెలకు 10 నుంచి 15 టన్నుల వరకు ముడిరాయిని బయటకు తీస్తారు. వీటిని ఫ్యాక్టరీలకు చేర్చి వివిధ సైజుల్లో కోత కోసి ప్యాక్చేసి విక్రయిస్తారు. ఈ డిజైన్ స్లేట్లను ఇంటి గోడలకు అందంగా అమర్చుకుంటారు. మార్కెట్లో విజయగోల్డ్ రకం టన్ను 20 వేలు, మల్టీకలర్ 10 వేలు, బ్లాక్ 40 వేలు, ఆటమ్ 20 వేల నుంచి *25 వేల వరకు విక్రయిస్తుంటారు. గనుల్లో పనిచేసే కార్మికులకు రోజుకు 200 కూలీ ఇస్తుంటారు. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పలకల గనుల్లో కార్మికులు రాయిని యంత్రాల ద్వారా బయటకు పంపిస్తారు. సుమారు 70 నుంచి 100 అడుగుల లోతులోకి దిగి రాయిని బయటకు తెస్తుంటారు. ఫ్యాక్టరీలు పనిచేస్తే కటింగ్ ఆపరేటర్లకు 165, క్యాలిబ్రేషన్ కార్మికులకు 100 ఇస్తారు.
నిలిచిన ఆర్డర్లు
ఢిల్లీ, చెన్నై, ముంబయి తదితర నగరాలతో పాటు శ్రీలంక, సింగపూర్, చైనా నుంచి డిజైన్ స్లేట్ల కోసం వస్తున్న ఆర్డర్లు నిలిచిపోయాయి. నవంబర్లో కురిసిన భారీ వర్షాలకు నెల రోజుల పాటు గనుల్లో నీరు చేరి పనులు నిలిచిపోయాయి. దీంతో ఇటు పలకల ఫ్యాక్టరీల్లో, అటు పలకల గనుల్లో పనులు లేక కార్మికులు కుటుంబాలను పోషించుకోలేక విలవిల్లాడిపోతున్నారు.
ప్రభుత్వం చొరవ చూపాలి
నెల రోజులుగా స్థానిక పారిశ్రామికవాడలో పనులు నిలిచిపోయాయి. సుమారు 3 వేల మంది కార్మికులు పనులు లేక ఇబ్బందులు పడుతున్నారు. కొంతమంది కార్మికులు కుటుంబాలతో సహా వలసలు పోతున్నారు. ప్రభుత్వం నూతన పారిశ్రామిక విధానంలో భాగంగా ఫ్యాక్టరీల యజమానులకు రాయితీలు ఇవ్వాలి. విద్యుత్ చార్జీలు తగ్గించాలి. ఆర్డర్లు వచ్చే విధంగా చూడాలి. - రూబెన్, వర్కర్స్ యూనియన్ కార్యదర్శి
ఓనమాలు దిద్దేదెలా?
Published Sun, Feb 9 2014 3:47 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
బీజేపీ అధికారంలోకి వస్తే భవిష్యత్ అంధకారం
మెట్ గాలాలో మెరిసిన అలియా.. చీరలో ఎంత అందంగా ఉందో..!(ఫోటోలు)
అభిమాని ఐఫోన్ బద్దలు కొట్టాడు.. గ్లౌవ్స్ గిఫ్ట్గా ఇచ్చాడు! వీడియో
విశాఖ నుంచే ప్రమాణస్వీకారం చేస్తా
టాలీవుడ్ హీరో కూతురి ప్రేమ పెళ్లి.. తేదీ ఫిక్స్!
వీళ్లే మన అభ్యర్థులు.. ఈసారి ఢిల్లీ పీఠం కదలాలి
ఇచ్ఛాపురం బహిరంగ సభలో సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్
చంద్రబాబు చేసిన మోసాలు లైవ్ లో వినిపించిన సీఎం జగన్
పెళ్లి ఫొటోలు డిలీట్ చేసిన స్టార్ హీరో.. కారణమేంటి?
సోమవారాల్లో నలిగిన బట్టలే ధరించండి! సీఎస్ఐఆర్ పరిశోధన సంస్థ
తప్పక చదవండి
- ‘చార్ సౌ పార్’ ఎందుకంటే... క్లారిటీ ఇచ్చిన ప్రధాని
- దేశంలో పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే?
- Rekha Jhunjhunwala: ఒక్కరోజులోనే రూ.800 కోట్ల నష్టం
- 'పుష్ప' వల్ల నాకు ఎలాంటి లాభం లేదు: ఫహాద్
- జాంబియా ప్రీ వెడ్డింగ్ వేడుక : అమ్మాయి ఇలా చేయాల్సిందే!
- ‘ఒకవేళ బెయిల్ ఇస్తే’.. కేజ్రీవాల్కు కండీషన్ పెట్టిన సుప్రీంకోర్టు
- PK: అన్నయ్య ప్రచారం చేస్తే తప్ప గెలవలేడా?
- తుప్పు పట్టిన సైకిల్లో మిగిలింది బెల్ మాత్రమే: సీఎం జగన్
- మెట్ గాలా 2024: అలియా టూ అంబికా మోదీ మెరిసిన బ్యూటీస్ (పోటోలు)
- LS Elections: కొనసాగుతున్న మూడో విడత పోలింగ్.. ఓటింగ్ శాతం ఎంతంటే..
Advertisement