
రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): రద్దీ దృష్ట్యా పలు ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు విజయవాడ రైల్వే డివిజన్ ఇన్చార్జ్ పీఆర్వో రాజశేఖర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్–నర్సాపూర్ ప్రత్యేక రైలు (07256) ఏప్రిల్ 27వ తేదీ సాయంత్రం 6.50 గంటలకు హైదరాబాద్లో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6.00కు నర్సాపూర్ చేరు కుంటుంది.
నర్సాపూర్–హైదరాబాద్ రైలు (07255) ఏప్రిల్ 29న రాత్రి 7.30కు నర్సాపూర్లో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6.50కు హైదరాబాద్ చేరుకుంటుంది. లింగంపల్లి–విశాఖపట్నం రైలు (07148) ఏప్రిల్ 26న సాయంత్రం 5.00 గంటలకు లింగంపల్లిలో బయలు దేరి మరుసటి రోజు ఉదయం 8.00 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. విశాఖపట్నం–లింగంపల్లి రైలు (07147) ఏప్రిల్ 27వ తేదీ ఉదయం 10.15కు విశాఖలో బయలుదేరి అదే రోజు రాత్రి 11.10కు లింగంపల్లి చేరుకుంటుంది.