ఏ జ్వరమైనా నిర్ధారణే ముఖ్యం

Self medication is not good for seasonal fevers in this Corona time - Sakshi

సీజనల్‌ జ్వరాలుగా భావించి స్వీయ చికిత్స మంచిది కాదు

సాక్షి, అమరావతి: జ్వర లక్షణాలను బట్టి స్వీయ చికిత్సలు తీసుకోవడం ఏమాత్రం ఆచరణీయం కాదని వైద్యులు చెబుతున్నారు. వర్షాకాలం కాబట్టి మలేరియా, డెంగీ జ్వరాలొస్తుంటాయి. వీటి లక్షణాలను బట్టి మందులు వాడటం సరికాదని, ఏ జ్వరమైనా వైద్యుడిని సంప్రదించి నిర్ధారణ చేసుకోవడం ముఖ్యమంటున్నారు. కొన్నిసార్లు కరోనా వైరస్‌ వల్ల వచ్చే జ్వరం సైతం ఇలాంటి లక్షణాలనే పోలినప్పుడు ఆ మందులు వాడి వదిలేస్తే ప్రమాదమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. 

► చలి జ్వరంతో కూడిన లక్షణాలుంటే మలేరియా అయ్యే అవకాశం ఉంది. 
► ప్రాథమిక ఆరోగ్య కేంద్రం స్థాయిలోనే ర్యాపిడ్‌ డయాగ్నిస్టిక్‌ టెస్ట్‌ కిట్‌ ద్వారా నిర్ధారించుకోవచ్చు. 
► డెంగీ వస్తే.. తీవ్ర జ్వరంతో పాటు కళ్ల వెనుక నొప్పి, శరీరంపై దద్దుర్లు వస్తాయి.ప్రాథమిక ఆరోగ్యకేంద్రం స్థాయిలో ఐజీజీ, ఐజీఎం పరీక్ష నిర్వహిస్తారు. 
► ఈ పరీక్షల్లో పాజిటివ్‌ వస్తే ఎలీశా టెస్ట్‌కు రిఫర్‌ చేస్తారు. ఈ పరీక్షలు పెద్దాస్పత్రుల్లోనే జరుగుతాయి.
► కరోనా వైరస్‌కు సంబంధించి దగ్గు, జలుబు, జ్వరం లక్షణాలుంటాయి. 
► గొంతు లేదా ముక్కులోంచి తేమను తీసి పరీక్ష నిర్వహిస్తారు. 
► మలేరియా, డెంగీ జ్వరాలొచ్చినప్పుడు కరోనా రాదన్న నిబంధనేదీ లేదు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top