జగన్తో సీమాంధ్ర ఉద్యోగుల ఫోరం భేటీ | Sakshi
Sakshi News home page

జగన్తో సీమాంధ్ర ఉద్యోగుల ఫోరం భేటీ

Published Wed, Sep 25 2013 11:01 AM

జగన్తో  సీమాంధ్ర ఉద్యోగుల ఫోరం భేటీ - Sakshi

హైదరాబాద్ : రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేస్తూ సమ్మె చేస్తున్న సీమాంధ్ర సచివాలయ ఉద్యోగుల ఫోరం బుధవారం ఉదయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. సమైక్య ఉద్యమానికి మద్దతు ఇవ్వాల్సిందిగా   వారు జగన్కు విజ్ఞప్తి చేశారు.

మరోవైపు తమ ప్రియతమ నేతను చూసేందుకు రాష్ట్రవ్యాప్తంగా వేలాదిమంది అభిమానులు, కార్యకర్తలు తరలి వస్తున్నారు. దాంతో జగన్ నివాసం అభిమాన సంద్రంతో పోటెత్తింది. కాగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు పార్టీ నేతలతో భేటీ కానున్నారు. ఆయనను కలిసేందుకు పార్టీ నేతలు లోటస్ పాండ్కు చేరుకుంటున్నారు.

Advertisement
Advertisement