ట్రాక్టర్‌తో రైతును ఢీకొట్టి హత్య | Sand Mafia Killed farmer in Chittoor District | Sakshi
Sakshi News home page

ట్రాక్టర్‌తో రైతును ఢీకొట్టి హత్య

Apr 22 2014 9:50 AM | Updated on Aug 28 2018 8:41 PM

ఇసుక మాఫియా ఆగడాలు మితిమీరుతున్నాయి. తమకు అడ్డొచ్చిన వారిని అంతం చేసేందుకు కూడా వెనుకాడడం లేదు.

చిత్తూరు: ఇసుక మాఫియా ఆగడాలు మితిమీరుతున్నాయి. తమకు అడ్డొచ్చిన వారిని అంతం చేసేందుకు కూడా వెనుకాడడం లేదు. చిత్తూరు జిల్లాలో ఇసుక మాఫియా ఓ రైతు ప్రాణాలను బలితీసుకుంది. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ప్రయత్నించిన రైతును ట్రాక్టర్‌తో ఢీకొట్టి హత్య చేశారు. వరదాయపాలెం మండలం సాకంబేడు వద్ద ఈ దారుణం చోటుచేసుకుంది.

దుండగులను పట్టుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. రాష్ట్ర వాప్తంగా ఇసుక మాఫియా ఆగడాలు నానాటికీ పెరిగిపోతున్నాయి. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకుంటున్న అధికారులను సైతం చంపేందుకు వెనుకాడడం లేదు. బరితెగిస్తున్న ఇసుక మాఫియాకు ఇకనైనా అడ్డుకట్ట వేయాలని ప్రజానీకం కోరుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement