సమైక్యాంధ్ర కోసం పట్టణ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పోస్టుకార్డుల ఉద్యమాన్ని చేపట్టారు.
సమైక్యాంధ్ర కోసం పోస్టుకార్డుల ఉద్యమం
Sep 19 2013 1:03 AM | Updated on Sep 18 2018 8:19 PM
ఎమ్మిగనూరు టౌన్, న్యూస్లైన్: సమైక్యాంధ్ర కోసం పట్టణ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పోస్టుకార్డుల ఉద్యమాన్ని చేపట్టారు. బుధవారం వివిధ పాఠశాలలకు చెందిన 600 మంది విద్యార్థులు ప్రధాన మంత్రి, రాష్ట్రపతి, సోనియాగాంధీ, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి పోస్టుకార్డులను పంపారు. కార్యక్రమంలో ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు ఉరుకుందు, కె.శ్రీనివాసులు, మహానందయ్య, మహాదేవప్ప పాల్గొన్నారు.
Advertisement


