- పెరిగిన వ్యయానికి బోర్డు ఆమోదం
- దిగుమతి కోల్పై సంప్రదింపులు
సాక్షి, హైదరాబాద్: నెల్లూరు జిల్లా దామోదరం సంజీవయ్య తాప విద్యుత్ కేంద్రం (కృష్ణపట్నం) ప్రాజెక్టు వ్యయం మరో రూ. 40 కోట్లు పెరిగింది. పెరిగిన వ్యయానికి మంగళవారం జరిగిన కృష్ణపట్నం పాలక మండలి సమావేశం ఆమోదం తెలిపింది. ఏపీ జెన్కో ఎండీ నేతృత్వంలో జరిగిన ఈ భేటీలో బోర్డు సభ్యులు కూడా పాల్గొన్నారు. 1600 మెగావాట్లతో ఏర్పాటు చేసిన కృష్ణపట్నం ప్రాజెక్టు ప్రతిపాదిత వ్యయం రూ. 8,500 కోట్లు. ఆ తర్వాత దీన్ని రూ. వెయ్యి కోట్లకు పెంచారు. తాజా పెరుగుదలతో నిర్మాణ వ్యయం రూ. 9,500 కోట్లకు చేరింది. ప్రాజెక్టు పూర్తి కాకుండానే ప్రాజెక్టు వ్యయం మెగావాట్కు 5.95 కోట్లకు చేరింది.
పూర్తయ్యే నాటికి మరింత పెరిగే అవకాశం ఉందని బోర్డు సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర విద్యుత్ సాధికార సంస్థ (సీఈఏ) నిబంధనల మేరకు మెగావాట్ రూ. 5.5 కోట్లే ఉండాల్సి ఉన్నా, దీనిపై సమగ్ర వివరాలతో సీఈఏను ఒప్పించాలని నిర్ణయించారు. కృష్ణపట్నం రెండో దశ వాణిజ్య ఉత్పత్తి తేదీ (సీవోడీ)పై సమావేశంలో చర్చించారు. ఈ ప్రాజెక్టుకు అవసరమైన విదేశీ బొగ్గును ఢిల్లీకి చెందిన ఎంఎంటీసీ సరఫరా చేసేందుకు ముందుకొచ్చింది. ఈ ప్రతిపాదనపై సమావేశంలో చర్చించారు. కోల్ ఇండియా నిబంధనలు ఏ విధంగా ఉన్నాయి? ఎంత ధరకు అందిస్తాడనే అంశాలపై చర్చించేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేయాలని బోర్డు నిర్ణయించింది.
మీ వాటా మీకిస్తాం... ప్రాజెక్టు వదిలేయండి
ఈ సందర్భంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కు చెందిన సభ్యుల మధ్య ఆసక్తికరమైన చర్చ జరిగినట్టు తెలిసింది. కృష్ణపట్నం విద్యుత్ వాటా అవసరం లేదని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. దీంతో షెడ్యూల్ కూడా చేయడం లేదు. భవిష్యత్లోనూ ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉంది కాబట్టి, కృష్ణపట్నం నిర్మాణ వ్యయంలో తెలంగాణ వాటా ఇస్తామని, ప్రాజెక్టును ఏపీ పరం చేయాలని ఏపీ జెన్కో ఎండీ సూచించినట్టు తెలిసింది. అయితే, దీనిపై ప్రభుత్వ స్థాయిలో చర్చించాల్సి ఉందని తెలంగాణ అధికారులు అన్నట్టు సమాచారం.
రూ.40 కోట్లు పెరిగిన కృష్ణపట్నం వ్యయం
Published Tue, Jun 30 2015 11:34 PM
Advertisement
Advertisement
T20 World Cup 2024: భారత్ చేతిలో ఓటమి.. వెక్కి వెక్కి ఏడ్చిన పాక్ ప్లేయర్
మళ్లీ 2014 నాటి అరాచక పాలన రిపీట్ అవుతుందా?
ఏపీ రాజధానిగా అమరావతి: చంద్రబాబు
సెన్సేషన్ సోఫియా.. తండ్రిపై అవినీతి కేసు, ఇంట్రెస్టింగ్ బ్యాక్గ్రౌండ్
ఏపీలో కుప్పకూలిన రాజ్యాంగ వ్యవస్థలు: వైఎస్ జగన్
యానిమల్ బ్యూటీ కొత్త బంగ్లా.. ధరెంతో తెలుసా?
భూకంపాన్ని తట్టుకునే ఇల్లు.. ఇది కదా అసలైన టెక్నాలజీ అంటే!
పాయే.. మళ్లీ చైనా పరువు పాయే!
ఈ బిచ్చగాడు ఎంత రిచ్ అంటే.. ఏకంగా రూ.కోటి ఇన్సూరెన్స్!
కారుపై పెద్దపులి దాడి..
టీమిండియా ఫీల్డింగ్ కోచ్గా జాంటీ రోడ్స్..?
హనీరోజ్ 'రాహేలు' టీజర్ విడుదల
సీరియస్గా ప్రయత్నించా.. ఎవరూ ఛాన్సివ్వలేదు: సేతుపతి
ఇద్దరూ టెకీలే: క్రికెటర్ సౌరభ్ నేత్రావల్కర్ భార్య గురించి తెలుసా? (ఫొటోలు)
సుమిత్ నగాల్ సంచలనం.. అత్యుత్తమ ర్యాంకు
హారర్ సస్పెన్స్ థ్రిల్లర్గా 'రా రాజా'.. టీజర్తోనే భయపెట్టారు!
ఆ దేశం ఇంకా 2016 లోనే ..!ఎందుకో తెలుసా..!
ఖైరతాబాద్ గణేశ్.. ఈసారి 70 అడుగుల ఎత్తు
తప్పక చదవండి
- టీమిండియా ఫీల్డింగ్ కోచ్గా జాంటీ రోడ్స్..?
- మారని చంద్రబాబు తీరు.. పోలవరం కట్టుకథలపై వైఎస్సాఆర్సీపీ కౌంటర్
- ఖైరతాబాద్ గణేశ్.. ఈసారి 70 అడుగుల ఎత్తు
- అదరగొడుతున్న హారర్ మూవీ.. రూ.50 కోట్లు దాటేసింది!
- ఢిల్లీ ఎయిర్పోర్టులో పవర్ కట్స్
- స్టార్ హీరోయిన్ కోసం చెరువులో దూకిన అభిమాని.. ఆ తర్వాత!
- అనంత్ అంబానీ - రాధిక ప్రీ వెడ్డింగ్ : అనంత్ లవ్ లెటర్ను గమనించారా?
- ఏడవటం ఆరోగ్యానికి మంచిదా..? నిపుణులు ఏమంటున్నారంటే..
- కెప్టెన్సీకి గుడ్ బై?.. బాబర్ ఆజం ఘాటు స్పందన
- తల్లి కాటికి.. తండ్రి కటకటాలకు...!
Advertisement