బెజవాడ బస్టాండ్లో 18.లక్షల బంగారం చోరీ | Rs.18 lakhs Value Gold ornaments Theft in vijayawada Bus Stop | Sakshi
Sakshi News home page

బెజవాడ బస్టాండ్లో 18.లక్షల బంగారం చోరీ

Nov 29 2013 8:37 AM | Updated on Sep 2 2017 1:06 AM

బెజవాడ బస్టాండ్లో 18.లక్షల బంగారం చోరీ

బెజవాడ బస్టాండ్లో 18.లక్షల బంగారం చోరీ

విజయవాడ బస్టాండ్లో సుమారు రూ.18 లక్షల విలువైన బంగారు ఆభరణాలు చోరీ అయ్యాయి.

విజయవాడ : విజయవాడ బస్టాండ్లో సుమారు రూ.18 లక్షల విలువైన బంగారు ఆభరణాలు చోరీ అయ్యాయి. గత రాత్రి ఈ సంఘటన జరిగింది. స్నేహితురాలి పెళ్లికి వచ్చిన మహిళ సూట్కేసులో 450 గ్రాముల బంగారు నగలున్న పెట్టెను అహరించారు. పోలీసుల కథనం ప్రకారం.... నిజామాబాద్కు చెందిన ప్రియాంక అమెరికాలో ఉంటుంది. ఆమె స్నేహితురాలు అనూష వివాహం బుధవారం రాత్రి విజయవాడలో జరిగింది. ఈ పెళ్లి కోసం ప్రియాంక తన తల్లి జానకితో కలిసి విజయవాడ వచ్చింది. నిజామాబాద్ వెళ్లేందుకు గురువారం రాత్రి పెళ్లివారు ఏర్పాటు చేసిన కారులో బస్టాండుకు వచ్చారు.

అంతలో గుర్తు తెలియని వ్యక్తి చొరవగా వచ్చి ఆమె లగేజీని బస్సు దగ్గరకు మోసుకొచ్చాడు. ఆ వ్యక్తి పెళ్లివారికి సంబంధించివాడని భావించి వారు అతడి వెంట నడిచారు. లగేజిని హైదరాబాద్ రూట్లో వెళ్లే బోధన్ బస్సులో పెట్టాడు. అంతలో తల్లి కింద ఉండగా ప్రియాంక టికెట్లు తీసుకునేందుకు వెళ్లింది. అంతే...తర్వాత లగేజి తెచ్చి బస్సులో పెట్టిన వ్యక్తి కనిపించలేదు. ఆ తర్వాత లగేజిని చూసుకోగా, రూ.18 లక్షల విలువైన బంగారు నగలున్న పెట్టె కనిపించలేదు. దీంతో వారు పోలీసుల్ని ఆశ్రయించారు. లగేజీ తెచ్చిన వ్యక్తే నగల్ని అపహరించి ఉంటాడని అనుమానిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement