ఆలయంలో చోరీ | Robbery in Temple | Sakshi
Sakshi News home page

ఆలయంలో చోరీ

Jul 31 2015 5:09 PM | Updated on Aug 30 2018 5:27 PM

కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం మల్లేపల్లి గ్రామంలోని ఎల్లమ్మ దేవాలయంలో శుక్రవారం తెల్లవారుజామున చోరీ జరిగింది.

కర్నూలు (వెల్దుర్తి) : కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం మల్లేపల్లి గ్రామంలోని ఎల్లమ్మ దేవాలయంలో శుక్రవారం తెల్లవారుజామున చోరీ జరిగింది. ఆలయంలోని హుండీని పగులగొట్టి సుమారు రూ.50 వేల నగదును దోచుకెళ్లారు. అమ్మవారి విగ్రహంపై ఉన్న వెండి ఆభరణాలను కూడా దోచుకెళ్లారు. వీటి విలువ రూ.15 వేలు ఉంటుందని గ్రామస్తులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement