ముద్దనూరు/కొండాపురం : గండికోట రిజర్వాయరు నిర్మాణంలో భాగంగా ముద్దనూరు, కొండాపురం మండలాల్లో మొత్తం 22 గ్రామాలతో పాటు,సుమారు 30 కిలోమీటర్ల రాష్ట్ర రహదారి ముంపునకు గురవుతోంది. ముద్దనూరు మండలంలోని కమ్మవారిపల్లె సమీపం నుంచి కొండాపురం మండలంలోని సుగుమంచిపల్లె వరకు పాత రహదారి ముంపునకు గురవుతుండడంతో దీనికి ప్రత్యమ్నాయంగా దాదాపు 9 ఏళ్ల క్రితమే డైవర్షన్ రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం అనుమతించింది.అయితే పనులు నత్తనడకన సాగుతున్నాయి.ముఖ్యమంత్రులు మారడం, పాత టెండర్లను రద్దుచేయడం, కొత్త టెండర్లలో అంచనాలు పెరగడం తప్ప రహదారి నిర్మాణం మత్రం పూర్తికాలేదు.
రూ. 40 నుంచిరూ.100కోట్లకు చేరిన రోడ్డు నిర్మాణ వ్యయం
అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి హయాంలో సుమారు రూ.45కోట్ల వ్యయంతో రహదారి నిర్మాణానికి అనుమతి లభించింది.వైఎస్సార్ మరణానంతరం పనులు నిలిచిపోయాయి..మరో రెండు మార్లు టెండర్ల ప్రక్రియ వరకు వచ్చి ఆగిపోయింది.తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రస్తుతం సుమారు రూ.100 కోట్ల పైచిలుకు వ్యయంతో రహదారి నిర్మాణం మొదలుపెట్టారు.అధికార పార్టీ అనుయాయులకే పనులు దక్కాయి. రహదారి నిర్మాణ వ్యయం రెట్టింపయినప్పటికీ,ఇప్పటికే రెండు మార్లు గడువు పెంచారు.
గండికోటలోకి నీరొస్తే అవస్థలే:
గండికోట ప్రాజెక్టులో సుమారు 5 టీఎంసీల నీరు నిల్వ చేస్తే ప్రస్తుతం ఉన్న కడప–తాడిపత్రి ప్రధాన రహదారిలో వాహనాలను ముద్దనూరు నుంచి మరో మార్గం ద్వారా మళ్లించాల్సిందే.గత ఏడాది కూడా ప్రాజెక్టులో నీరు చేరడంతో వాహనాలను మళ్లించారు.అయితే ప్రస్తుతం ప్రాజెక్టులో 4 టీఎంసీలు చేరగానే కొండాపురానికి సమీపంలోని చిత్రావతి బ్రిడ్జికి నీరు చేరువకావడంతో పాటు వంతెన కూడా ప్రమాదకరంగా తయారైంది.ఈ నేపథ్యంలో అధికారులు ముందుజాగ్రత్త చర్యగా ముద్దనూరు నుంచి తాడిపత్రి, అనంతపురం పట్టణాలకు వెళ్లే వాహనాలను జమ్మలమడుగు,మల్లేల మీదుగా తిప్పుతున్నారు. దీనివల్ల కొండాపురం మండల ప్రజలు ప్రయాణానికి తవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా తాళ్లప్రొద్దుటూరు, దత్తాపురం, గంగాపురం, చౌటిపల్లె పల్లె గ్రామాల ప్రజలు వ్యవప్రయాసలకు గురవుతున్నారు. ఇది ఇలా ఉండగా మళ్లీ రహదారి నిర్మాణానికి మరోమారు గడువు పెంపు దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం.ఈ మార్గంలో ఇప్పటికే సుమారు 90 శాతం మేర కల్వర్టుల నిర్మాణం పూర్తయినట్లు, రైల్వే ట్రాక్పై బ్రిడ్జి పూర్తయితే రహదారిని త్వరగా నిర్మిస్తామని జీఎన్ఎస్ఎస్ ఈఈ మధుసూధన్రెడ్డి తెలిపారు.
ఎన్నాళ్లు.. ఎన్నేళ్లు..
Published Sat, Oct 21 2017 6:22 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తెలంగాణ: రైతుబంధుకు ‘ఈసీ’ బ్రేక్
ఏపీలోని పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం
T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
బ్లూ ఎకానమీలో ఆంధ్రప్రదేశ్ హవా.. ఎగుమతుల్లో సరికొత్త రికార్డ్
ఖరీదైన కారులో వడా పావ్ : ఢిల్లీ ‘కుమారాంటీ’ మరో సంచలనం
‘చార్ సౌ పార్’ ఎందుకంటే... క్లారిటీ ఇచ్చిన ప్రధాని
ప్రశాంతంగా నీట్
కొత్త గనుల ఏర్పాటుకు కృషి చేయాలి
ప్రమాదంలో ప్రజాస్వామ్యం
అ‘పూర్వ’ం.. ఆత్మీయం
తప్పక చదవండి
- తెలంగాణ: రైతుబంధుకు ‘ఈసీ’ బ్రేక్
- ‘చార్ సౌ పార్’ ఎందుకంటే... క్లారిటీ ఇచ్చిన ప్రధాని
- దేశంలో పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే?
- 'పుష్ప' వల్ల నాకు ఎలాంటి లాభం లేదు: ఫహాద్
- జాంబియా ప్రీ వెడ్డింగ్ వేడుక : అమ్మాయి ఇలా చేయాల్సిందే!
- ‘ఒకవేళ బెయిల్ ఇస్తే’.. కేజ్రీవాల్కు కండీషన్ పెట్టిన సుప్రీంకోర్టు
- PK: అన్నయ్య ప్రచారం చేస్తే తప్ప గెలవలేడా?
- తుప్పు పట్టిన సైకిల్లో మిగిలింది బెల్ మాత్రమే: సీఎం జగన్
- మెట్ గాలా 2024: అలియా టూ అంబికా మోదీ మెరిసిన బ్యూటీస్ (పోటోలు)
- LS Elections: కొనసాగుతున్న మూడో విడత పోలింగ్.. ఓటింగ్ శాతం ఎంతంటే..
Advertisement