‘సార్వత్రిక’ ఫలితాలపై నేటి నుంచి రాజమండ్రిలో జగన్ సమీక్ష

‘సార్వత్రిక’ ఫలితాలపై నేటి నుంచి రాజమండ్రిలో జగన్ సమీక్ష - Sakshi


హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై చర్చించి, పార్టీ భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేయడానికి బుధవారం నుంచి జిల్లాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమీక్షా సమావేశాలు ప్రారంభం కానున్నాయి. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాల  నేతలతో ముఖాముఖిగా మాట్లాడనున్నారు. 2014 లోక్‌సభ, శాసనసభ ఎన్నికల్లో పార్టీ ఆంధ్రప్రదేశ్‌లో 67 శాసనసభ, 8 లోక్‌సభ స్థానాలను గెల్చుకున్న సంగతి తెలిసిందే.



తొలి విడతగా రాజమండ్రిలోని ఆర్ అండ్ బీ అతిథిగృహంలో నేటి నుంచి మూడు రోజుల పాటు (6 వరకు) శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం, ఉభ య గోదావరి జిల్లాల్లోని నియోజకవర్గాలల్లో పరిస్థితిపై సమీక్షిస్తారు. తర్వాత 9, 10 తేదీల్లో కృష్ణా, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలపై ఒంగోలులో సమీక్షలు ఉంటాయి. 11, 12 తేదీల్లో చిత్తూరు, అనంతపురం, కర్నూలు, వైఎస్సార్ జిల్లాల సమీక్షా సమావేశాలు నిర్వహించనున్నారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top