ఆయిల్ ట్యాంకర్‌లో ఎర్రచందనం దుంగల రవాణా

సాక్షి, కడప: ఎర్రచందనం స్మగ్లర్లు కొత్త పంథాను ఎన్నుకున్నారు. ఆయిల్ ట్యాంకర్‌లో ఎర్రచందనం దుంగలు తరలిస్తూ పట్టుబడ్డారు. వైఎస్సార్‌ జిల్లా సిద్దవటం మండలం కనుమలోపల్లె దగ్గర ఆయిల్ ట్యాంకర్‌లో రవాణా అవుతున్న 95 ఎర్రచందనం దుంగలను పోలీసులు ఆదివారం పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టుబడిన ఎర్రచందనం విలువ కోటి రూపాయలు ఉంటుందని అధికారులు చెప్పారు. ఇప్పటి వరకు వాహనాల ద్వారా రవాణా చేస్తే పోలీసులు పట్టుకుంటారన్న భయంతో ఆయిల్ ట్యాంకర్‌లో దుంగలను నింపి రవాణా చేస్తుండడం విశేషం. అయితే ఈ సంఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top