భారత తీరప్రాంత రక్షణ దళంలోకి మరో నౌక | Rani Roshmoni Ship entered in Indian Coast Guard | Sakshi
Sakshi News home page

భారత తీరప్రాంత రక్షణ దళంలోకి మరో నౌక

Jun 18 2018 11:53 AM | Updated on Jun 18 2018 11:57 AM

Rani Roshmoni Ship entered in Indian Coast Guard - Sakshi

భారత తీర ప్రాంత రక్షణ దళంలోకి మరో గస్తీ నౌక చేరింది.

సాక్షి, వైజాగ్: భారత తీర ప్రాంత రక్షణ దళంలోకి మరో గస్తీ నౌక చేరింది. రాణి రోష్మణి నౌకను కోస్ట్‌గార్డు అదనపు డీజీ వీఎస్‌ఆర్ మూర్తి జాతికి అంకితం చేశారు. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా 51 మీటర్ల పొడవైన ఈ నౌకను విశాఖ హిందూస్థాన్ షిప్‌యార్డు తయారు చేసింది.  రాణి రోహ్మణి ధైర్యసాహసాలు గుర్తు చేసుకుంటూ నౌకకు నామకరణం చేశారు.

ఈ నౌకను నిర్మించడం షిప్‌యార్డు ఘనతల్లో ఒకటని హిందూస్థాన్ షిప్‌యార్డు సీఎండీ తెలిపారు. 34 నాటికల్ మైళ్ల వేగంతో ప్రయాణించడానికి చాలా ప్రయోగాలు చేశామని పేర్కొన్నారు. సాంకేతికంగా చాలా ఆధునికంగా ఉండేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు తీర ప్రాంత రక్షణ దళం అవసరాలకు అనుగుణంగా నౌకల తయారీకి షిప్‌యార్డు సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు.
 

Advertisement
 
Advertisement
Advertisement