కృపాకర్ కుటుంబం హత్య కేసులో ఐజాక్ అరెస్ట్ | Rajaratnam arrested | Sakshi
Sakshi News home page

కృపాకర్ కుటుంబం హత్య కేసులో ఐజాక్ అరెస్ట్

Oct 10 2014 7:56 PM | Updated on Sep 2 2017 2:38 PM

కడపలో సంచలనం కలిగించిన కృపాకర్ కుటుంబం హత్య కేసులో ఆయన తండ్రి రాజారత్నం ఐజాక్ను పోలీసులు అరెస్ట్ చేశారు.

కడప: కడపలో సంచలనం కలిగించిన కృపాకర్ కుటుంబం హత్య కేసులో ఆయన తండ్రి రాజారత్నం ఐజాక్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనను కాసేపట్లో మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు.

శాంతి సంఘం జిల్లా అధ్యక్షుడు, జియోన్ స్కూల్ యజమాని రాజారత్నం ఐజక్ కుమారుడు కృపాకర్, కోడలు మౌనికతోపాటు ముగ్గురు పిల్లలు ఏడాది క్రితం మాయమయ్యారు. మౌనిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కుటుంబ సభ్యులు ఐదుగురూ హత్యకు గురైనట్టు విచారణలో తేలింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు రామంజనేయ రెడ్డిని ఇప్పటికే అరెస్ట్ చేయగా, మరో నిందితుడిగా ఉన్న రాజారత్నంను అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement