సీఎం రమేష్తో ఎమ్మెల్యే పితాని సమావేశం | pitani satyanarayana, varadarajula reddy met cm ramesh | Sakshi
Sakshi News home page

సీఎం రమేష్తో ఎమ్మెల్యే పితాని సమావేశం

Jun 17 2015 10:51 AM | Updated on Aug 17 2018 12:56 PM

సీఎం రమేష్తో ఎమ్మెల్యే పితాని సమావేశం - Sakshi

సీఎం రమేష్తో ఎమ్మెల్యే పితాని సమావేశం

ఓటుకు నోటు కేసులో ప్రమేయం ఉన్న రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్కు ఏసీబీ నోటీసులు జారీ చేసేందుకు రంగం సిద్ధం చేసింది.

హైదరాబాద్ : ఓటుకు నోటు కేసులో ప్రమేయం ఉన్న రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్కు ఏసీబీ నోటీసులు జారీ  చేసేందుకు రంగం సిద్ధం చేసింది. ఏ క్షణంలో అయినా ఆయనకు నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది.  సీఆర్‌పీసీ సెక్షన్ 160 కింద  దశలవారీగా విచారణకు రావాలని నోటీసులు ఇవ్వనుంది.

 

ఈ నేపథ్యంలో  టీడీపీ ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ, పార్టీ నేత వరదరాజులరెడ్డి బుధవారం ఉదయం  సీఎం రమేష్ నివాసానికి వెళ్లారు. సీఎం రమేష్తో వీరు ఇరువురు భేటీ అయ్యారు. మరోవైపు ఓటుకు నోటు కేసులో ఏసీబీ నుంచి నోటీసులు అందుకున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన వేం నరేందర్‌రెడ్డిని తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకరరావు కలిశారు.

 

Advertisement
 
Advertisement
Advertisement