అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు పెరగడంతో పెట్రోల్, డీజల్ ధరలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
నెల్లూరు(రెవెన్యూ): అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు పెరగడంతో పెట్రోల్, డీజల్ ధరలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పెట్రోల్పై లీటర్ రూ 3.18, డీజల్పై లీటర్ రూ 3.09 పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పన్నులు అదనం. పాత ధర రూ.66.48 కాగా పెరిగిన ధరతో రూ.70.43 అవుతుంది. డీజిల్ పాతధర రూ.55.12 పెరిగిన ధరతో 58.61 అవుతుంది.
పెరిగిన ధరలు శనివారం ఆర్ధరాత్రి నుంచి అమల్లోకి వస్తాయి. గత నెలలో పెట్రోల్, డీజల్పై వ్యాట్ పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నెలరోజులు గడవక ముందే మళ్లీ పెట్రోల్, డీజల్ ధరలు పెరిగాయి. పెట్రో ధరల పెంపుతో జిల్లావాసులపై నెలకు రూ.13 కోట్ల వరకు అదనపుభారం పడనుంది. అలాగే నిత్యావసర సరుకులు, కూరగాయల ధరలకు రెక్కలు వచ్చే అవకాశం ఉంది. జిల్లాలో 300లకు పైగా పెట్రోల్ బంకులు ఉన్నాయి. జిల్లాలో రోజుకు 4 లక్షల లీటర్ల పెట్రోల్, 9 లక్షల లీటర్ల డీజల్ను వినియోగిస్తారు. పెట్రోల్పై వినియోగదారులకు రోజుకు రూ. 12.72 లక్షల అదనపు భారం పడనుంది. అంటే నెలకు రూ.4 కోట్లపైనే.. అలాగే రోజుకు 9 లక్షల లీటర్ల డీజిల్ వినియోగిస్తారు. వినియోగదారులకు డీజల్పై రోజుకు రూ.28 లక్షల అదనపు భారం పడునుంది. నెలకు సుమారు రూ.9 కోట్లకు పైగా అవుతుంది. పెరిగిన పెట్రోల్ ధరలతో సామాన్యులు నానా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. నిత్యావసర ధరలతోపాటు బస్సు, ఆటో చార్జీలు పెరిగే అవకాశం ఉంది.