శిశువును పొదలో పడేసేందుకు యత్నం | Parents Try To Put Child Dead Body In Bushes In Kurnool | Sakshi
Sakshi News home page

పేగు బంధానికి మచ్చ తెచ్చిన తల్లిదండ్రులు

Jan 17 2020 10:33 AM | Updated on Jan 17 2020 3:49 PM

Parents Try To Put Child Dead Body In Bushes In Kurnool - Sakshi

మృత శిశువును తల్లిదండ్రులకు అప్పగించిన దృశ్యం 

సాక్షి, డోన్‌(కర్నూలు): పేగు తెంచుకొని పుట్టిన బిడ్డ.. రెండు నెలల పసిగుడ్డు.. అనారోగ్యంతో మృతిచెందితే.. మానవత్వం మరిచి ముళ్లపొదల్లో పారవేసిన తల్లిదండ్రుల ఉదంతం ఇది. బనగానపల్లె మండలం లింగదొడ్డి గ్రామానికి చెందిన రాజు,లక్ష్మి అనే దంపతులకు ఇద్దరు కుమార్తెలు. రెండో కుతూరు అనారోగ్యంతో కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం ఉదయం మృతి చెందింది. దీంతో వారు నేరుగా మృత శిశువును రైలులో డోన్‌కు తీసుకొచ్చి పట్టణ శివారులోని లెప్రసీ కాలనీలో ముళ్లపొదల్లో పడవేశారు. దీన్ని గమనించిన ద్రోణాచలం సేవాసమితి సభ్యులు పట్టణ పోలీసులకు సమాచారమిచ్చారు. అక్కడికి చేరుకున్న పోలీసులు తల్లిదండ్రులను పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. ఎస్‌ఐలు సురేష్, నరేష్‌ తల్లిదండ్రులకు కౌన్సెలింగ్‌ నిర్వహించి మృత శిశువును ఖననం చేస్తామనే హామీతో వదిలివేశారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement