మంత్రితో విద్యార్థుల వాగ్వాదం | palle raghunatha reddy dig with students | Sakshi
Sakshi News home page

మంత్రితో విద్యార్థుల వాగ్వాదం

May 25 2015 1:06 PM | Updated on Nov 9 2018 4:46 PM

కార్పొరేట్ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ అనంతపురంలో జిల్లా పరిషత్ కార్యాలయం ఎదుట విద్యార్థి సంఘాలు సోమవారం ఆందోళనకు దిగాయి.

అనంతపురం: అధిక ఫీజులు వసూలు చేస్తున్న కార్పొరేట్ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ అనంతపురంలో జిల్లా పరిషత్ కార్యాలయం ఎదుట విద్యార్థి సంఘాలు సోమవారం ఆందోళనకు దిగాయి. జడ్పీ కార్యాలయంలోకి దూసుకెళ్లేందుకు విద్యార్థులు ప్రయత్నించారు. ఈ సందర్భంగా మంత్రి పల్లె రఘునాథరెడ్డి, విద్యార్థి సంఘాల నేతలకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

కాగా, విద్యార్థుల ఆందోళనకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు వై. విశ్వేశ్వరరెడ్డి, చాంద్ బాషా, డీసీసీబీ చైర్మన్ శివశంకరరెడ్డి మద్దతు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement