ఆర్టీసీ బస్సు, బైక్ ఢీ..ఒకరి మృతి | one dead in road accident at ysr district | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ బస్సు, బైక్ ఢీ...ఒకరి మృతి

Dec 2 2015 5:25 PM | Updated on Aug 30 2018 3:56 PM

వైఎస్సార్ జిల్లాలో బుధవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డుప్రమాదంలో ఓ యువకుడు మృతిచెందాడు.

సిద్ధవటం: వైఎస్సార్ జిల్లాలో బుధవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డుప్రమాదంలో ఓ యువకుడు మృతిచెందాడు. సిద్ధవటం మండలం చాముండేశ్వరీపేట సమీపంలో ఆర్టీసీ బస్సు, బైక్ ఢీకొన్నాయి.

ఈ ప్రమాదంలో పార్వతీపురం గ్రామశివార్లలో ఉన్న పెట్రోల్ బంకులో పనిచేస్తున్న కుర్రా శివకుమార్(30) అనే యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు. శివకుమార్ తన బైక్‌పై మధ్యాహ్నాం భోజనానికి భాకరాపేటలోని తన ఇంటికి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. యువకుడి మృతితో అతని కుటుంబంలో విషాదం నెలకొంది. ఆర్టీసీ బస్సు ప్రొద్దుటూరు డిపోకు చెందినదిగా గుర్తించారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement