ఆర్టీసీ బస్సు, బైక్ ఢీ..ఒకరి మృతి | one dead in road accident at ysr district | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ బస్సు, బైక్ ఢీ...ఒకరి మృతి

Dec 2 2015 5:25 PM | Updated on Aug 30 2018 3:56 PM

వైఎస్సార్ జిల్లాలో బుధవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డుప్రమాదంలో ఓ యువకుడు మృతిచెందాడు.

సిద్ధవటం: వైఎస్సార్ జిల్లాలో బుధవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డుప్రమాదంలో ఓ యువకుడు మృతిచెందాడు. సిద్ధవటం మండలం చాముండేశ్వరీపేట సమీపంలో ఆర్టీసీ బస్సు, బైక్ ఢీకొన్నాయి.

ఈ ప్రమాదంలో పార్వతీపురం గ్రామశివార్లలో ఉన్న పెట్రోల్ బంకులో పనిచేస్తున్న కుర్రా శివకుమార్(30) అనే యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు. శివకుమార్ తన బైక్‌పై మధ్యాహ్నాం భోజనానికి భాకరాపేటలోని తన ఇంటికి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. యువకుడి మృతితో అతని కుటుంబంలో విషాదం నెలకొంది. ఆర్టీసీ బస్సు ప్రొద్దుటూరు డిపోకు చెందినదిగా గుర్తించారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement