బండల లోడ్తో వెళుతున్న ట్రాక్టర్ బోల్తాపడి ఓ వ్యక్తి మృతి చెందాడు.
బండల లోడ్తో వెళుతున్న ట్రాక్టర్ బోల్తాపడి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన చీగలగల్ మండలంలోని కంభదహల్ గ్రామంలో మంగళవారం ఉదయం జరిగింది. ఉరవకొండ మండలం పీతవరం గ్రామానికి చెందిన మాల వెంకటేశ్వర్లు మంగళవారం ఉదయం బండల లోడ్తో బయలుదేరాడు. కంభదహల్ గ్రామం సమీపంలోని పొలంలో ట్రాక్టర్ బోల్తాపడింది. ట్రాక్టర్లో ఉన్న వెంకటేశ్వర్లు అక్కడిక్కడే మృతి చెందాడు.