అసెంబ్లీ, మండలి సమావేశాలకు నోటిఫికేషన్‌

Notification for Assembly and Council meetings - Sakshi

సాక్షి, అమరావతి: అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు సెప్టెంబర్‌ 6న ఉదయం 9:15 గంటలకు ప్రారంభమవుతాయని అసెంబ్లీ కార్యదర్శి విజయరాజు శనివారం నోటిఫికేషన్‌ జారీ చేశారు. ఆ తరువాత స్పీకర్‌ నేతృత్వంలోని బీఏసీ సమావేశమై సభను ఎన్నిరోజులు నిర్వహించాలనే షెడ్యూల్‌ను రూపొందిస్తారని పేర్కొన్నారు. 10 నుంచి 12 రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. సెప్టెంబర్‌ 6న శాసనమండలి సమావేశాలు ప్రారంభమవుతాయని మండలి కార్యదర్శి సత్యనారాయణ మరో నోటిఫికేషన్‌ను జారీ చేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top