breaking news
assembly monsoon sessions
-
అసెంబ్లీ నేడు ఒక్కరోజే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ వర్షాకాల సమావేశాలు రెండోరోజు ఆదివారంతోనే ముగించాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. పలు జిల్లాల్లో వర్ష బీభత్సం, గణేశ్ నిమజ్జనం తదితరాల నేపథ్యంలో ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. అవసరమైతే కొద్ది విరామం తర్వాత మళ్లీ సమావేశాలు నిర్వహించే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు శనివారం అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ అధ్యక్షతన జరిగిన బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) భేటీలో ప్రభుత్వం ప్రతిపాదించినట్లు సమాచారం. అయితే ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్తో పాటు బీజేపీ, ఎంఐఎం పార్టీలు కూడా కనీసం 15 రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని కోరినట్లు తెలిసింది. ఆ ప్రతిపాదనకు ప్రభుత్వం అంగీకరించక పోవడంతో భేటీ నుంచి బీఆర్ఎస్ వాకౌట్ చేసింది. కాళేశ్వరం నివేదిక సమర్పించనున్న సీఎం ఆదివారం ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యే సమావేశంలో కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన పీసీ ఘోష్ కమిషన్ పూర్తి నివేదికను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సభకు సమర్పిస్తారు. దీనిపై చర్చ అనంతరం పంచాయతీరాజ్, మున్సిపల్ చట్ట సవరణ బిల్లులపై కూడా సభలో చర్చిస్తారు. స్థానిక సంస్థలతో పాటు మున్సిపాలిటీల్లో రిజర్వేషన్లకు సంబంధించి ఉన్న గరిష్ట పరిమితిని ఎత్తివేస్తూ సవరణలు ప్రతిపాదిస్తారు. పంచాయతీరాజ్ చట్టం 2018లోని సెక్షన్ 285 (ఎ)కు సవరణల ద్వారా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కల్పనకు మార్గం సుగమం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పీపీటీకి బీఆర్ఎస్ పట్టు పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై చర్చ సందర్భంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్కు తమకు అవకాశం ఇవ్వాలని బీఏసీ భేటీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు కోరారు. ఈ విజ్ఞాపనను పరిశీలిస్తానని స్పీకర్ హామీ ఇచ్చినట్లు తెలిసింది. ఇక కాళేశ్వరం నివేదికపై అసెంబ్లీలో జరిగే చర్చలో ప్రతిపక్ష నాయకుడు, మాజీ సీఎం కేసీఆర్ పాల్గొనే అవకాశాలు కనిపించడం లేదు. అయితే సభలో అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్ ఇప్పటికే దిశా నిర్దేశం చేసినట్లు తెలిసింది. యూరియా కొరత, వరద బీభత్సం, విష జ్వరాలు, గురుకులాల్లో విద్యార్థుల మరణాలు తదితర ప్రజా సమస్యలపై చర్చించాలని బీఏసీ సమావేశంలో బీఆర్ఎస్ ప్రతిపాదించింది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, హరీశ్రావుతో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి, బీజేపీ శాసనసభా పక్షం నాయకుడు ఎ.మహేశ్వర్రెడ్డి ఈ భేటీలో పాల్గొన్నారు. ఇక శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మండలి బీఏసీ సమావేశంలో భట్టి విక్రమార్క, శ్రీధర్బాబుతో పాటు డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్, మండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, చీఫ్ విప్ పట్నం మహేందర్రెడ్డి, ఎమ్మెల్సీలు మహేశ్కుమార్ గౌడ్, నెల్లికంటి సత్యం, అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్ నరసింహాచార్యులు పాల్గొన్నారు. -
హైదరాబాద్ రోడ్ల పరిస్థితులపై సభలో ప్రశ్నోత్తరాలు
-
డ్వాక్రా రుణమాఫీపై బట్టబయలైన టీడీపీ మోసం
-
బట్టబయలైన టీడీపీ మోసం
అమరావతి: డ్వాక్రా రుణమాఫీపై టీడీపీ మోసం బట్టబయలైంది. అసెంబ్లీ వేదికగా డ్వాక్రా మహిళలకు రుణాలు మాఫీ చేయలేదని మంత్రి పరిటాల సునీత లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. డ్వాక్రా రుణాల మాఫీపై లేఖ ద్వారా వైఎస్సార్సీపీ సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఎటువంటి రుణాలు మాఫీ చేయలేదని మంత్రి పరిటాల సునీత సమాధానమిచ్చారు. 2014 నాటికి ఉన్న రుణాలపై ఎటువంటి మాఫీ చేయలేదని వెల్లడించారు. డ్వాక్రా రుణాలను పూర్తిగా మాఫీ చేసే ఆలోచన ఉందా అనే ప్రశ్నకు.. రుణమాఫీ చేసే ఆలోచన లేదని సభలో సమాధానం ఇచ్చారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చే సమయానికి రాష్ట్రంలో రూ.14200 కోట్ల డ్వాక్రా రుణాలు ఉన్నాయి. చంద్రబాబు మాత్రం బహిరంగ సభల్లో మహిళలకు పూర్తిగా డ్వాక్రారుణాలు మాఫీ చేసినట్లు ప్రచారం చేయడం గమనర్హం. లిఖితపూర్వక లేఖ -
అసెంబ్లీ, మండలి సమావేశాలకు నోటిఫికేషన్
సాక్షి, అమరావతి: అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు సెప్టెంబర్ 6న ఉదయం 9:15 గంటలకు ప్రారంభమవుతాయని అసెంబ్లీ కార్యదర్శి విజయరాజు శనివారం నోటిఫికేషన్ జారీ చేశారు. ఆ తరువాత స్పీకర్ నేతృత్వంలోని బీఏసీ సమావేశమై సభను ఎన్నిరోజులు నిర్వహించాలనే షెడ్యూల్ను రూపొందిస్తారని పేర్కొన్నారు. 10 నుంచి 12 రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. సెప్టెంబర్ 6న శాసనమండలి సమావేశాలు ప్రారంభమవుతాయని మండలి కార్యదర్శి సత్యనారాయణ మరో నోటిఫికేషన్ను జారీ చేశారు. -
అసెంబ్లీ సమావేశాలు పొడిగించేది లేదు
ఎట్టి పరిస్థితుల్లోనూ ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలను పొడిగించేది లేదని మంత్రి యనమల రామకృష్ణుడు స్పష్టం చేశారు. కేవలం 5 రోజులకు మాత్రమే ఈ సమావేశాలను పరిమితం చేయడం సరికాదని, అనేక అంశాలు ఉన్నందున కనీసం 15 రోజుల పాటు నిర్వహించాలని ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో మంత్రి ఈ ప్రకటన చేశారు. ప్రత్యేక హోదాపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఎలాగైనా స్టేట్మెంట్ ఇవ్వొచ్చని ఆయన చెప్పారు. లిఖితపూర్వకంగా ఇచ్చిన స్టేట్మెంట్లో లేని అంశాలను కూడా మాట్లాడొచ్చని అన్నారు. ప్రత్యేక హోదాపై తీర్మానం కోసం స్టేట్మెంట్లో ప్రస్తావించకపోయినా అసెంబ్లీలో తీర్మానం చేస్తామని ఆయన చెప్పారు. సీఎం స్టేట్ మెంట్ ఇచ్చేటప్పుడు సభలో ఎవ్వరూ మాట్లాడకూడదని రామకృష్ణుడు అన్నారు. ప్రతిపక్షాన్ని కంట్రోల్ చేయడానికే తమ సభ్యులు ముగ్గురు మాట్లాడారని ఆయన చెప్పారు.