కొరిటెపాడు(గుంటూరు), న్యూస్లైన్
గ్రామ పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులను తక్షణమే విడుదల చేయాలని సర్పంచుల సంఘం రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షుడు, చినకాకాని మాజీ సర్పంచ్ గంగాధరరావు డిమాండ్ చేశారు. సర్పంచుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గుంటూరులో కలెక్టరేట్ ఎదుట శుక్రవారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా గంగాధరరావు మాట్లాడుతూ పంచాయతీలకు నిధులు రాకపోవడంతో గ్రామాలను ఏమాత్రం అభివృద్ధి చేసుకోలేక పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణం స్పందించి పంచాయితీలకు నిధులను విడుదల చేయాలని కోరారు. సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షుడు కొసనా మధుసూదనరావు మాట్లాడుతూ నిధుల కొరత మూలంగా గ్రామాల్లో పారిశుద్ధ్యం, విద్యుత్ బకాయిలు పేరుకుపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. 2012-12, 2013-14 సంవత్సరాలకు సంబంధించిన నిధులు ఇంత వరకు విడుదల చేయక పోవడం బాధాకరమన్నారు. నిధులు విడుదల చేయనప్పుడు పంచాయితీ ఎన్నికలు ఎందుకు నిర్వహించారని ప్రభుత్వాన్ని నిలదీశారు. మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టు మరోపక్క విద్యుత్ అధికారుల అరాచకాలు పెరిగి పోయాయన్నారు.
ఎన్నికలకు ముందు ప్రత్యేక అధికారుల పాలన నాటి విద్యుత్ బకాయిలకు కూడా తమను జవాబుదారులను చేసి విద్యుత్ అధికారులు ఒత్తిడికి గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం కలెక్టర్ ఎస్.సురేశ్కుమార్, జేసీ వివేక్యాదవ్, జిల్లా పంచాయితీరాజ్ అధికారులను కలసి వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో సంఘం జిల్లా నాయకులు పానకాలరెడ్డి, గంపల శివనాగేశ్వరరావు, గోగినేని వసుధ, ఎం.సాంబశివరావు, గౌస్ సంధాని, జిల్లాలోని అన్ని మండలాల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు, సర్పంచులు పాల్గొన్నారు.
పంచాయతీలకు నిధులు విడుదల చేయాలి
Published Sat, Mar 8 2014 2:16 AM
Advertisement
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
ఓ మదీ మేలుకో..!
‘ఎన్నికల సమయంలో డ్యూటీ పీరియడ్గా పరిగణించాలి’
స్ట్రాంగ్ రూమ్లు పరిశీలించిన ఎస్పీ
లూజు పెట్రోల్ విక్రయించరాదు
24న ఎచ్చెర్ల ఐటీఐలో జాబ్ మేళా
మల్లేష్కు కన్నీటి వీడ్కోలు
తగ్గని ఎన్నికల వేడి
మహేంద్రతనయలో పడి యువకుడి మృతి
ఎంపీసీ స్ట్రీమ్ పరీక్షకు 97 మంది గైర్హాజరు
ట్రాక్టర్ డ్రైవర్ ఆత్మహత్య
తప్పక చదవండి
- AP: అంతా ప్రీ ప్లాన్డ్గానే.. సిట్ నివేదికలో సంచలన విషయాలు!
- Telangana: రూ.500కు గ్యాస్ సిలిండర్ కొందరికే ..!
- ఐదో దశ ఓటింగ్పై ఎన్నికల సంఘం ఆందోళన?
- 24 నుంచి ‘పది’ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు
- ఓ మదీ మేలుకో..!
- టీడీపీ నేత బంధువు కారులో రూ.68.40 లక్షలు స్వాధీనం
- ఆహా ఏమి రుచి.. అనరా మైమరచి
- సానుకూల సంకేతాలు
- Enforcement Directorate; ఆప్కు అక్రమంగా రూ. 7.08 కోట్ల విదేశీ నిధులు!
- జూన్ 8న చేప ప్రసాదం పంపిణీ
Advertisement