మూడు రాజధానులకు మద్దతుగా జిల్లాలో భారీ ర్యాలీ!

MP Margani Bharat Ram And Others Held Massive Rally In East Godavari - Sakshi

సాక్షి, తూర్పు గోదావరి: రాజధాని వికేంద్రీకరణకు అసెంబ్లీలో ఆమోదం లభించడంతో రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్‌ ఆధ్వర్యంలో వైఎస్సార్‌ సీపీ శ్రేణులు  భారీ బైక్‌ ర్యాలీని నిర్వహించారు. రాజమండ్రిలోని మోరంపూడి జంక్షన్‌ నుంచి క్వారీ సెంటర్‌ వరకు జరిగిన ఈ ర్యాలీలో స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొని హర్షం వ్యక్తం చేశారు. అదేవిధంగా పిఠాపురంలో సైతం వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, స్థానికులు సోమవారం పాదయాత్రను నిర్వహించారు.మరోవైపు రంపచోడవరంలో వైఎస్సార్‌ సీపీ ఆధ్వర్యంలో భారీ బైక్‌ ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీలో ఆంధ్రప్రదేశ్‌ న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు రామన్న దొర, మంగా బొజ్జయ్య, పండా రామకృష్ణ తదితరుల పాల్గొన్నారు.

కాకినాడ: రాష్ట్ర అభివృద్ధికై సీఎం వైఎస్‌ జగన్‌ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన మూడు రాజధానుల బిల్లుకు మద్దతుగా వైఎస్సార్‌ సీపీ కార్యాలయ నుంచి బలాజీ చెరువు సెంటర్‌ వరకు భారీ బైక్‌ ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీలో నగర వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు ఫ్రూటీ కుమార్‌, యాళ్ల పట్టాభి, రావూరి వెంకటేశ్వరరావు, నల్లబిల్లి సుజాత, బెండా విష్ణు, పెదబాబు పాల్గొన్నారు.


రామచంద్రపురం: మూడు రాజధానుల బిల్లుపై అసెంబ్లీలో అమోదం ప్రకటించడంతో హర్షం వ్యక్తం చేస్తూ వైఎస్సార్‌ సీపీ నాయకులు ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీలో పార్లమెంటరీ అధ్యక్షుడు తోట త్రిముర్తులు ఇతర నాయకులు పాల్గొన్నారు.

అమలాపురం: రాజధాని వికేంద్రీకరణ నిర్ణయానికి అసెంబ్లీ ఆమోదం అభించడంతో  వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. అదేవిధంగా కుడుపూడి చిట్టబ్బాయి ఆధ్వర్యంలో అమలాపురంలో ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కుడుపూడి సూర్యనారాయణ రావు, చెల్లుబోయిన శ్రీను, వంటెద్దు వెంకయ్య నాయుడు ఇతరులు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top