మంత్రి పల్లెకు త్రుటిలో తప్పిన ప్రమాదం | Minister village occupied missed a risk | Sakshi
Sakshi News home page

మంత్రి పల్లెకు త్రుటిలో తప్పిన ప్రమాదం

Sep 7 2015 2:35 AM | Updated on Apr 3 2019 7:53 PM

మంత్రి పల్లెకు త్రుటిలో తప్పిన ప్రమాదం - Sakshi

మంత్రి పల్లెకు త్రుటిలో తప్పిన ప్రమాదం

మంత్రి పల్లె రఘనాథరెడ్డి ప్రయాణిస్తున్న కారుకు ఆదివారం తృటిలో పెను ప్రమాదం తప్పింది

 బత్తలపల్లి : మంత్రి పల్లె రఘనాథరెడ్డి ప్రయాణిస్తున్న కారుకు ఆదివారం తృటిలో పెను ప్రమాదం తప్పింది. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మంత్రి పల్లె రఘనాథరెడ్డి కదిరి నుంచి అనంతపురానికి వెళుతుండగా బత్తలపల్లి మండలం జ్వాలాపురం క్రాస్ వద్ద బత్తలపల్లి వైపు నుంచి కదిరికి వెళుతున్న కారు ఢీ కొంది. మంత్రి కారు అద్దం పగిలిపోయింది. ఇంతలో ఎస్కార్ట్ సిబ్బంది అక్కడికి చేరుకుని మంత్రి కారు డ్రైవర్‌ను మందలించినట్లు సమాచారం. ఈ సంఘటనపై తమకు ఎలాంటి సమాచారం అందలేదని బత్తలపల్లి పోలీసులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement