సత్యా నాదెళ్లకు పితృ వియోగం

Microsoft CEO Satya Nadella Father Yugandhar Passes Away  - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ :మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్యా నాదెళ్ల నివాసంలో విషాదం చోటుచేసుకుంది. ఆయన తండ్రి, మాజీ ఐఏఎస్‌ అధికారి బీఎన్‌ యుగంధర్‌ (80) శుక్రవారం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శుక్రవారం మృతి చెందారు. 1962 బ్యాచ్‌కు చెందిన యుగంధర్‌ సుదీర్ఘ కాలం సేవలు అందించారు. 

పీవీ నర్సింహారావు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో ఆయన పీఎంవో కార్యదర్శిగా, ప్రణాళిక సంఘం సభ్యుడిగా పలు కీలక హోదాల్లో పని చేశారు. అలాగే గ్రామీణాభివృద్ధి శాఖలో కీలక సంస్కరణలు తీసుకు వచ్చారు. కాగా బీఎన్‌ యుగంధర్‌ స్వస్థలం అనంతపురం జిల్లా యల్లనూరు మండలం బుక్కాపురం. అయితే అనంతరం ఆయన హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. ఇక సత్యా నాదెళ్ల తల్లి ప్రభావతి 2015లో మరణించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top