అనుమానాస్పదస్థితిలో వివాహిత మృతి | married woman sunitha died in suspicious state | Sakshi
Sakshi News home page

అనుమానాస్పదస్థితిలో వివాహిత మృతి

Sep 9 2015 6:12 PM | Updated on Sep 3 2017 9:04 AM

విశాఖపట్టణం జిల్లా భీమిలి మండలం టీనగరపాలెం గ్రామంలో ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో బుధవారం మృతి చెందింది.

తగరపువలస(విశాఖపట్టణం): విశాఖపట్టణం జిల్లా భీమిలి మండలం టీనగరపాలెం గ్రామంలో ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో బుధవారం మృతి చెందింది. గ్రామానికి చెందిన పల్లా శ్రీనివాసరావు, సునీత(25) దంపతులకు ఏడేళ్ల క్రితం వివాహమైంది. వారికి ఏడాది, మూడేళ్ల వయస్సున్న ఇద్దరు కూతుళ్లున్నారు.

బుధవారం సాయత్రం వారు ఉండే భవనం మూడో అంతస్తు నుంచి ప్రమాదవశాత్తు కింద పడి మృతి చెందిందని భర్త శ్రీనివాసరావు చెబుతున్నారు. అయితే, స్థానికులు మాత్రం శ్రీనివాసరావుపైనే అనుమానం వ్యక్తం చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
 

Advertisement
 
Advertisement
Advertisement