సాక్షి ప్రతినిధి, ఏలూరు :సంక్రాంతి సంబరాల ముసుగులో యథేచ్ఛగా సాగుతున్న కోడిపందేలు, గుండాట, పేకాటలను నిలువరించే పనిలో కొందరు పోలీసులు.. అదే అదనుగా రూ.లక్షలు ఆర్జించేపనిలో మరికొందరు ఖాకీలు కొద్దిరోజులుగా నిమగ్నమైపోయారు. సరిగ్గా ఇదే సమయంలో పశ్చిమ ఏజెన్సీలో మావోయిస్టులు సంచరిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఒక వర్గానికి చెందిన మావోయిస్టులు ఇటీవల కొంతకాలం వరకు పశ్చిమ ఏజెన్సీలోనే మకాం వేసి, అనంతరం తూర్పుగోదావరి జిల్లాకు తరలిపోయారు. కానీ పదిరోజుల కిందట తిరిగి తూర్పుగోదావరి జిల్లా నుంచి పశ్చిమగోదావరి అటవీ ప్రాంతంలోకి వచ్చినట్టు తెలుస్తోంది.
సుమారు 12 మంది సాయుధులైన మావోయిస్టుల్లో ముగ్గురు మహిళలు ఉన్నట్టు తెలిసింది. వీరు రెండు దళాలుగా పశ్చిమ ఏజెన్సీలో సంచరిస్తున్నారని, అధునాతన ఆయుధాలు కలిగి ఉన్నారని చెబుతున్నారు. దొరమామిడి, కన్నాపురం, బుట్టాయగూడెం తదితర ప్రాంతాలకు చెందిన రైతులను, పత్తి వ్యాపారులను పిలిపించి వసూళ్లకు పాల్పడుతున్నారన్న ప్రచారం కూడా సాగుతోంది. సరిగ్గా భోగిరోజు ముందు పోగొండ రిజర్వాయర్ సమీపంలో సంచరించిన మావోలు దొరమామిడికి చెందిన రైతులను అలివేరు పిలిపించి డబ్బులు వసూలు చేసినట్టు తెలిసింది. అదేవిధంగా బుట్టాయగూడెంలోని కొంతమంది పత్తి వ్యాపారులకు కూడా ఇదే మాదిరి కబురంపి డబ్బులు తీసుకున్నారని చెబుతున్నారు.
కామయ్యకుంట, లంకపల్లి, మంగయ్యపాలెం, తెల్లదిబ్బల ప్రాంతాల్లో కూడా మావోలు సంచరిస్తున్నట్టు తెలిసింది. ఏజెన్సీ మారుమూల గ్రామాలతోపాటు మైదాన ప్రాంతంలోని కొంతమంది వ్యాపారుల నుంచి కూడా వసూళ్లకు పాల్పడినట్టు సమాచారం. పశ్చిమ ఏజెన్సీలో మావోయిస్టులు సంచరిస్తున్న విషయం నిఘా వర్గాల దృష్టికి కూడా వెళ్లినట్టు తెలిసింది. రాష్ట్రంలో ఎక్కడా మావోల అలికిడే లేదంటూ పశ్చిమగోదావరి జిల్లాకు వచ్చినప్పుడల్లా రాష్ట్ర హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప పదేపదే ప్రకటలు చేస్తుంటారు. ఇప్పుడు సరిగ్గా జిల్లా అంతటా సంక్రాంతి సంబరాల్లో మునిగిన వేళ ఏజెన్సీ, మైదాన ప్రాంతాల్లో మావోయిస్టుల అలికిడి పోలీసువర్గాల్లోనూ కలకలం రేపుతోంది.
మావోల అలికిడి
Published Mon, Jan 18 2016 12:59 AM
Advertisement
Advertisement
ఈనాడు సంస్థల ఛైర్మన్ రామోజీరావు కన్నుమూత
రాజీనామా చేసి వెళ్లిపోండి.. టీడీపీ కార్యకర్తల అల్టిమేటం
పట్టలేని సంతోషం.. మర్చిపోలేని విషాదం.. రెండూ ఈ నెలలోనే!
పిఠాపురం వర్మపై జనసేన దాడి
ఇదేం వ్యాధి..నిద్రలో షాషింగ్ చేయడమా..?
టీడీపీ యథేచ్ఛదాడులతో ఏపీలో ఆటవిక పరిస్థితులు: వైఎస్ జగన్
పాస్వర్డ్ మర్చిపోయాడు.. 11 ఏళ్ల తరువాత చూస్తే రూ. కోట్ల డబ్బు
T20 WC 2024: పాక్ను మట్టికరిపించిన అమెరికా జట్టులో సగం మంది మన వారే..!
పూర్వం 'ధ్రువసంధి' అయోధ్యకు.. రాజుగా..
డోనాల్డ్ ట్రంప్ కు అమెరికన్ల నుంచి ఊహించని షాక్
ఓటీటీలో 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి'.. అధికారిక ప్రకటన
Nitanshi Goel: 16 ఏళ్ల ఈ అమ్మాయి.. బాలీవుడ్ ఇండస్ట్రీలో..
పెళ్లి తర్వాత రిలీజయ్యే ఫస్ట్ సినిమా ఇదే!
హీరో శివ రాజ్కుమార్పై సొంత బామ్మర్ది సంచలన ట్వీట్!
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (09-06-2024)
Tanya Ghavri: స్టయిలింగ్లో తనతో పోటీ అంటే.. కొంచెం కష్టమే!
అంచనాలను మించి పెరిగిన అమెరికా నియామకాలు
ఈ తరహా దాడులు పిరికిపందల చర్య: షర్మిల ఆగ్రహం
తప్పక చదవండి
- WI Vs UGA: 5 వికెట్లతో చెలరేగిన అకిల్.. పసికూనపై విండీస్ ఘన విజయం
- ఘోరం: వివాహిత మిస్సింగ్, మూడురోజల తర్వాత..
- రెండో రోజు.. చేప ప్రసాదం కోసం పోటెత్తిన జనాలు
- తెలంగాణ గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ప్రారంభం
- కొన్ని గంటల్లో 'కల్కి' ట్రైలర్.. ప్రీ రిలీజ్ ఈవెంట్ అక్కడేనా..?
- బేగంపేటలో వ్యక్తి దారుణ హత్య..
- 15 నెలల చిన్నారిపై వీధి కుక్కల దాడి
- ఎంటర్ప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్.. వెల్లయన్ సుబ్బయ్య
- Weekly Horoscope: ఈ రాశివారు చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి కాగలవు
- ఎంతో కష్టపడ్డాం.. మంత్రి పదవి ఇవ్వండి
Advertisement