
ఆంధ్రప్రదేశ్:
► ఏపీలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 420కి చేరింది.
► ఏపీలో ప్రస్తుతం 401 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
► ఇప్పటి వరకు 12 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.
► కరోనా వైరస్తో ఏడుగురు మృతి చెందారు.
► పల్లెల్లో పంటల కొనుగోళ్లు
► గ్రామస్థాయిలో 786 కేంద్రాలు ఏర్పాటు
► నేటి నుంచి జొన్న, మొక్కజొన్న , శనగలు, కంది, పసుపు కొనుగోలు
► నేటి నుంచి కృష్ణా జిల్లాలో రోజుకు 800 నుంచి 1000 మందికి కరోనా వైద్య పరీక్షలు నిర్వహిస్తామని కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్ తెలిపారు.
► నేడు ఇటలీలోని తెలుగు విద్యార్థులు విశాఖ చేరుకొనున్నారు.
తెలంగాణ
► తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 531కి చేరింది.
► తెలంగాణలో కరోనాతో ఇప్పటివరకు 16 మంది మృతి చెందారు.
► కరోనా నుంచి కోలుకుని 103 మంది డిశ్చార్జ్ అయ్యారు.
► తెలంగాణలో ప్రస్తుతం 412 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
జాతీయం:
► దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 9,211గా నమోదైంది.
► దేశంలో కరోనాతో ఇప్పటివరకు 331 మంది మృతి చెందారు.
► మహారాష్ట్రలో 1,982 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 149 మంది మృతి చెందారు.
అంతర్జాతీయం:
► ప్రపంచవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 18.52 లక్షలకు చేరింది.
► ప్రపంచవ్యాప్తంగా కరోనాతో 1.14 లక్షల మంది మృతి చెందారు.
► ప్రపంచవ్యాప్తంగా కరోనా నుంచి 4.23 లక్షల మంది కోలుకున్నారు.